ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి
తేదీ, జూన్ 28, 2025-
నమస్తే భరత్
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నిర్మల్ జిల్లా // శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రికి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరిగిందని, దశలవారీగా ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం 100 శాతం అమలైందని వెల్లడించారు. అలాగే, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాలన మరింత పారదర్శకంగా, వేగవంతంగా అమలు చేయనున్నట్లు వివరించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అన్ని ప్రభుత్వ పథకాలను అర్హులైన పేద ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. జిల్లాలో వికలాంగుల సౌకర్యార్థం అలిమ్కో సంస్థ ద్వారా రూ. 1.21 కోట్లు విలువ చేసే ఉపకరణాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 2632 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారు. వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం 1,62,414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభాజాతి చట్టం అమలులో భాగంగా గ్రామ రెవెన్యూ సదస్సులు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా దాదాపు 65 లక్షల మొక్కల నాటేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. అలాగే మహిళా సంఘాలకు రూ. 133 కోట్ల రుణాల చెక్ ను అందజేశారు. డ్రగ్స్, వైద్య ఆరోగ్యశాఖ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే దివ్యాంగులకు ట్రై సైకిళ్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు కలిసి పంపిణీ చేశారు.
అంతకుముందు కలెక్టరేట్ ప్రాంగణం లో ఫుడ్ వెస్టేజ్ కంపోస్టింగ్ యంత్రాన్ని రిబ్బన్ కత్తిరించి మంత్రి ప్రారంభించారు.
ఈ సమావేశంలో నిర్మల్ ముధోల్ ఖానాపూర్ ల శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పలు పథకాల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

