సీ.యస్.కె విల్లాస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణస్వీకరణ మహోత్సవం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో సీఎస్కే విల్లాస్ కాలనీ అభివృద్ధి
పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
కన్నుల పండుగగా సాగిన నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
నూతన కాలనీ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ తో సభ్యుల్లో నూతన ఉత్సాహం
కలిసికట్టుగా నడుద్దాం...కాలనీని అభివృద్ధి చేసుకుందాం ... గౌరవ అధ్యక్షులు అరటి యాదయ్య యాదవ్
మహిళలు అభివృద్ధి కమిటీలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది... నూతన అధ్యక్షుడు బంటారం మహేష్ గౌడ్
భిన్నత్వంలో ఏకత్వం లాగా.... సీఎస్కే విల్లాస్ లోని ప్రజలందరి సహకారంతోనే అభివృద్ధి... దిడ్డి గోపాల్ నారాయణ
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్15:ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండ దండలతో ఆయన ఆశీర్వాద బలంతో సీఎస్కే విల్లాస్ కాలనీ అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని, పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ మరియు మహిళా సభ్యులతో కలిసి షాద్ నగర్ పట్టణంలోనే సీఎస్కే విల్లాస్ కాలనీ నెంబర్ వన్ గా నిలవాలని గౌరవాధ్యక్షుడు అరటి యాదయ్య అందరినీ కోరారు. సీఎస్కే విల్లాస్ కాలనీ అభివృద్ధి కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులందరూ సీఎస్కే విల్లాస్ లోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం మెయిన్ పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని, విల్లాస్ లోని మహిళా మణులందరూ వేదమంత్రోచరణాలతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షునిగా అరటి యాదయ్య, నూతన అధ్యక్షునిగా బంటారం మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ప్రసన్న, కోశాధికారిగా బాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఇంజమూరి గోపాల్, పోలేపల్లి రమేష్ గౌడ్, బి శ్రీకాంత్ రెడ్డి, ఎం అరుణ, కే భాగ్యలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా పి బిక్షపతి, ఈ దత్తాత్రేయ, నాగిళ్ళ కిషోర్, ప్రశాంత్, రాఘవేందర్ రెడ్డి, డి సునీత, న్యాయ సలహాదారులుగా ఇంజమూరి నర్సింలు, జే హరికిషన్, కే హరీష్, మీడియా ఇన్చార్జిలుగా బి రాఘవేంద్ర గౌడ్, పి సందీప్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా అక్కడికి విచ్చేసిన విల్లాస్ యజమానులు అందరూ నూతన కమిటీ సభ్యులను శాలువాలు మరియు పూలదండలతో సత్కరించారు. అనంతరం సాగిన కార్యక్రమంలో
గౌరవ అధ్యక్షులు అరటి యాదయ్య , నూతన అధ్యక్షుడు బంటారం మహేష్ గౌడ్ లు మాట్లాడుతూ
ప్రమాణ స్వీకారం చేసిన ఏకగ్రీవ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎస్కే విల్లాస్ కాలనీ అభివృద్ధి కొరకై యువత ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన ఈ కమిటీ కాలనీ అభివృద్దే తమ ధ్యేయంగా పనిచేయాలని, ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని, అందరి అభిప్రాయాలు ఆకాంక్షల మేరకే సమిష్టి నిర్ణయాలు తీసుకుని కాలనీ అభివృద్ధికై పాటుపడాలని, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అండదండలు నూతన కమిటీకి మెండుగా ఉన్నాయని, కాలనీ అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే తో పాటు ఎంపీ ని, అధికారులు అందర్నీ కలుపుకొని పోయి గణనీయంగా కాలనీని అభివృద్ధి చేయాలని, ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి కాలనీలోని మహిళా మణులు అందరూ రావడం చాలా సంతోషకరమైన విషయమని, అభివృద్ధి విషయంలో మహిళలందరూ తమ అభిప్రాయాలు కూడా నూతన కమిటీకి తెలియజేయాలని, కాలనీ అభివృద్ధి విషయంలో మహిళలందరూ ప్రత్యేక పాత్ర పోషించి, అభివృద్ధి కొరకై ఏర్పడిన ఏకగ్రీవ నూతన కమిటీని ముందుండి నడిపించాలని, రిజిస్ట్రేషన్ లేకుండా కూడా కొంతమంది నూతన కమిటీ అంటూ ముందుకు వచ్చి ఎన్ని అవాంతరాలు సృష్టించినా కూడా, మనమందరం ఏకతాటిపై నిలబడి కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, కాలనీ అభివృద్ధి విషయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరి ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా కాలనీని అభివృద్ధి చేయాలని, కాలనీ అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా పనిచేయాలని, ఎవరు కూడా ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు పోవద్దని సమిష్టి నిర్ణయమే మన కాలనీ అభివృద్ధి అని ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు అరటి యాదయ్య, నూతన అధ్యక్షుడు బంటారం మహేష్ గౌడ్ అన్నారు.
దిడ్డి గోపాల్ నారాయణ మాట్లాడుతూ
భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు జీవిస్తున్నట్టుగానే మన సీఎస్కే విల్లాస్ కాలనీలో కూడా అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని భిన్నత్వంలో ఏకత్వం లాగా మన సీఎస్కే కాలనీ కూడా షాద్ నగర్ పట్టణంలో నెంబర్ వన్ గా నిలవాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి అభివృద్ధి విషయంలో కొన్ని సూచనలు సలహాలు చేశారు. అభివృద్ధి విషయంలో నూతన కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరం కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడే కాలనీ అభివృద్ధి జరుగుతుందని, డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ చెట్ల పెంపకం, పార్కుల పరిశుభ్రత ఇవన్నీ నిరంతరాయంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి సీఎస్కే బిల్లాస్ లోని యజమానులందరి సహాయ సహకారాల అవసరం ఉంటుంది కాబట్టి విల్లాస్ లోని యజమానులు అందరూ అభివృద్ధి విషయంలో నూతన కమిటీకి సహకరించి సీఎస్కే విల్లాస్ ను షాద్ నగర్ లోనే నెంబర్ వన్ నిలపాలని అందరినీ కోరారు.కన్నుల పండుగగా సాగిన సీఎస్కే విల్లాస్ ఏకగ్రీవ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విల్లాస్ లోని యజమానులు అందరూ, కాలనీలోని మహిళలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన దాస చంద్ర శేఖర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తో పాటు, ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
