నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీం ద్వారా ఉచిత శిక్షణ శిక్షణ

నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీం ద్వారా ఉచిత శిక్షణ శిక్షణ

 


కోర్సు డైరెక్టర్ కోటేశ్వరరావు


నమస్తే భారత్: భద్రాచలం


జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీం ద్వారా టెక్ షోర్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్, పాల్వంచ నందు క్వాలిటీ అషురెన్స్ & క్వాలిటీ చెక్స్ డిప్లొమా ఇన్ ఫైర్ & సేఫ్టీ కోర్సులలో ఉచిత శిక్షణ మరియు బోజన వసతితో సహా (60) రోజుల రెసిడెన్షియల్ శిక్షణ యువతీ యువకులకు ప్రాక్టికల్ గా ఇవ్వడం జరుగుతుందని కోర్సు డైరెక్టర్ కోటేశ్వరరావు అన్నారు. 
ఆదివారం నాడు సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సూచనల మేరకు ఐటిడిఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంనకు వచ్చిన సందర్శకులకు అత్యవసర  సమయంలో ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పర్యాటకులకు అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకస్మిక అగ్ని ప్రమాదాలు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ, మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ ద్వారా చేయవలసిన సపరియాలు గురించి తెలియజేశారు. నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం ద్వారా థియరీ ప్రాక్టికల్ మరియు ఇండస్ట్రియల్ ఎక్స్ ఫోర్స్, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ సెక్స్ మరియు డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుల గురించి ఐటిఐ మరియు డిప్లమా పదో తరగతి ఆపైన పాసైన యువతీ యువకులకు రెండు నెలలపాటు శిక్షణ ఇస్తున్నామని, ఉత్సాహవంతులైన గిరిజన యువతి యువకులు గ్రామీణ అభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ప్రభాకర్ రావు, మ్యూజియం ఇంచార్జ్ వీరస్వామి, ప్రసాద్, కళ్యాణ్ మరియు సంస్థ యువతి యువకులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు అమలు చెయ్యాలి.. మంత్రి తుమ్మలను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు అమలు చెయ్యాలి.. మంత్రి తుమ్మలను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు
హైదరాబాద్‌: రంగరెడ్డి జిల్లాలో పలు మండలాలకు చెందిన రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం నిలిపివేయడంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లాలోనిదాదాపు 9 మండలాల రైతుల...
పేద విద్యార్థులకు అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణి:ఆర్యవైశ్య సంఘం నాయకులు పిప్పిరి రవీందర్ గుప్తా
కొండ పొచ్చమ్మ రిజర్వాయర్‌లో ప్రజలు ప్రవేశించరాదు – పోలీస్ హెచ్చరిక
మరిపెడ మండల నూతన మెడికల్ అసోసియేషన్ ఎన్నిక 
పిడిఎస్ రైస్ పట్టివేత: ధన్వాడ ఎస్సై రాజశేఖర్
షాద్ నగర్ లో ప్రైవేట్ స్కూల్స్ దందాలు
ఆడపిల్లలను వేధిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు: షీ  టీమ్ పోలీసులు.