హైదరాబాదులో హత్య కుట్ర చేధించి, క్రూరమైన నేర చరిత్ర కలిగిన ఐదుగురు నిందితులు అరెస్ట్ – రూ. 40,000 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్, 8 జూలై – న్యాయమిత్ర న్యూస్
హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ కమిషనర్ సౌత్ జోన్ మరియు ఫలక్నుమా పోలీసుల సంయుక్త చర్యలో క్రూరమైన నేర చరిత్ర కలిగిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి రూ. 40,000 నగదు మరియు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో Cr.No.268/2025 U/s 61(2)(a) BNS కింద నమోదు చేయబడింది.
అరెస్టైన నిందితులు వివరాలు 1) సయ్యద్ ఫయ్యాజ్ (39), రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఫలక్నుమా, 2) సయ్యద్ జాఫర్ ఉద్దీన్ @ అబ్బు (40), రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఫలక్నుమా, 3) మొహమ్మద్ ఖలీల్ఉద్దీన్ (30), ప్రైవేట్ ఉద్యోగి, ఫలక్నుమా (సస్పెక్ట్ షీటర్), 4) మొహమ్మద్ ఇబ్రాహీం (30), డ్రైవర్, మైలార్దేవ్పల్లి (రోడీ షీటర్)
మరియు 5) సయ్యద్ యూనుస్ @ అజ్జు (28), ఫలక్నుమా నివాసముంటున్నరు.
ఈ నిందితులంతా హైదరాబాద్లో పుట్టి పెరిగినవారు. ప్రధాన నిందితుడు సయ్యద్ ఫయ్యాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వివాదాస్పద భూముల సెటిల్మెంట్లలో కూడా పాల్గొంటున్నాడు. అతనికి దుండిగల్ పోలీస్ స్టేషన్కు చెందిన రౌడీ షీటర్ ముజాహిద్ @ ముజ్జుతో గతంలో ఆర్థిక వివాదాల నేపథ్యంలో శత్రుత్వం ఏర్పడింది. ముజాహిద్ ఇటీవల పరోల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. అతను తనను హత్య చేయబోతున్నాడని భావించిన ఫయ్యాజ్, ముందస్తుగా ముజాహిద్ను హత్య చేయించాలని కుట్ర పన్నాడు.
ఈ హత్యకు రూ.15 లక్షలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకొని, ముందుగా రూ. 40,000 అడ్వాన్స్గా చెల్లించాడు. ఈ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ మరియు ఫలక్నుమా పోలీసులు సంయుక్తంగా నిందితులను అరెస్ట్ చేసి, నగదు మరియు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్ను శ్రీ ఎస్. రాఘవేంద్ర (ఇన్స్పెక్టర్, సౌత్ జోన్), శ్రీ కె. ఆది రెడ్డి (ఇన్స్పెక్టర్, ఫలక్నుమా), ఎస్ఐలు నావీన్, సమీయుజ్ జామా, మహేష్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది., ఈ సందర్భంగా శ్రీ అందే శ్రీనివాసరావు
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ నగరం ప్రకటన ద్వారా తెలియజేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

