జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాము.. వెంటనే ఆ కేసును ఎత్తివేయాలి

పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్ కార్మిక సంక్షేమ సంఘం
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్06:జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ పై రాజోలు పోలీస్ లు కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖండిస్తూ.. వెంటనే ఆ కేసును ఎత్తివేయాలి అని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు..
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద దన్వాడ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడ రైతులు ఉద్యమం చేస్తుండగా జనం సాక్షి పత్రికా సంపాదకులు, జర్నలిస్టు రెహమాన్ అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ అతనిని ఎ2 గా చేరుస్తూ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని, ప్రజా పోరాటాలను పత్రికలో వేయడమే తప్పు అయితే ఇక పత్రికలు ఎందుకు అని, ఒక తెలంగాణ ఉద్యమ కారుడు, జర్నలిస్ట్, ప్రజా సమస్యలపై నిరంతరం తన గొంతు , ప్రజల గొంతుకను వినిపించటమే నేరమా, ఇలా సమస్యలను వెలుగెత్తి ప్రజల తరుపున పోరాడే వారిపై కేసులు పెట్టడం ఎక్కడి న్యాయం అన్నారు.. కేంద్రంలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణిచివేసే కుట్ర మాత్రమే అని విమర్శించారు..ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం కూడా రెహమాన్ పక్షాన అండగా నిలవడం సంతోషదాయకం అని, వెంటనే రెహమాన్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels


Latest News
