ఎడతెరిపి లేకుండా కురుస్తున్న
వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
నమస్తే భారత్: భద్రాది కొత్తగూడెం బ్యూరో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉంది. రోడ్లపైకి నీరు చేరే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, బయటకు రావాల్సి వస్తే అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా అధికారులు సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సెల్ఫీలు తీసుకోవడానికి పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లి ప్రమాదాలకు లోనుకావద్దని ఆయన సూచించారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజలు తక్షణమే జిల్లా కలెక్టరేట్లో.. లేదా ఆర్డీవో కార్యాలయాల్లో ..ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్లకు, లేదా తమ మండల తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు కాల్ చేసి సమాచారం అందించి సహాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు మరియు అన్ని మండల అధికారులు అప్రమత్తంగా ఉండి, వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో సంబంధిత రెవెన్యూ, పోలీసు, రోడ్లు, మున్సిపల్ పంచాయతీ శాఖలతో సమన్వయం చేసుకుని తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పడుతున్న వర్షాల సందర్భంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండటాన్ని అలవాటుగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమయంలో వర్షాలకు తీసుకునే ముందు జాగ్రత్తలు, అప్రమత్తత చర్యలు రాబోయే గోదావరి వరదల సమయంలో కూడా ఉపయోగపడతాయని, ఎప్పుడైనా వచ్చే వరదలకు సకాలంలో స్పందించడానికి అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే విధంగా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి అధికారులు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

