జూలై 5, 6 తేదీలలో జరుగు బికేఎంయు జిల్లా మాసభల కరపత్రం విడుదల 

జూలై 5, 6 తేదీలలో జరుగు బికేఎంయు జిల్లా మాసభల కరపత్రం విడుదల 

 

జిల్లా వ్యవసాయ సంఘం ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 20:తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా మహాసభలను జూలై 5 6 తేదీలలో జరపతలపెట్టాము జయప్రదం చేయగలరని సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జే అంజయ్య బుద్ధుల జంగయ్యలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మా సభలకు సంబంధించిన కరపత్రాన్ని బ్లాక్ ఆఫీస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు  విడుదల చేశి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా హైదరాబాదుకు కూతబెట్టి దూరంలో ఉన్నదని కానీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన గ్రామీణ ప్రాంత పేద ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణీకరణ నేపథ్యంలో షాద్ నగర్ చేవెళ్ల శంషాబాద్ ఇబ్రహీంపట్నం పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని గ్రామాలన్నిటిని కూడా మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకు వస్తున్నారు కానీ మున్సిపాలిలో కలిసిన గ్రామాలలో ఉపాధి లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు మున్సిపాలిటీలలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు గ్రామాలలో రోజురోజుకు వ్యవసాయం తగ్గుముఖం పడుతుందని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల  చుట్టూరా వేలాది ఎకరాలను వెంచర్లు చేసి ప్లాట్లు పామ్ హౌజ్ లఅభివృద్ధి జరుగుతున్న ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామాలలో పొలాలు అమ్ముకున్న సన్నా చిన్నకారు రైతులు వ్యవసాయ కార్మికులు పట్టణాలలో కొంతమేర ఇండ్లు కట్టుకున్న పనులు దొరకక దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారని అందుకని పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పనులు ప్రారంభించి అందరికి ఉపాధి కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల పెద్ద ఎత్తున సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా ఫరూక్నగర్ బి కే ఎం యు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఎం రాములు ప్రధాన కార్యదర్శిగా కె రాజు నాయక్ ఉపాధ్యక్షులుగా జి జంగయ్య పి శంకర్ కార్యదర్శులుగా కే రాములు గౌడ్ చి చెన్నయ్య కోశాధికారిగా పైకి రమేష్ తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు స్వరూప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News