కార్మికుల కుటుంబాలకు  అధికారులు, పరిశ్రమల యాజమాన్యం భరోసా ఇవ్వాలి

కార్మికుల కుటుంబాలకు  అధికారులు, పరిశ్రమల యాజమాన్యం భరోసా ఇవ్వాలి

 

పరిశ్రమ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలి

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 02:పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి సుమారు 50 మందికి పైగా కార్మికులు మరణించడం తీవ్రంగా కలిచి వేసిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.శవాలు గుర్తుపట్టలేని స్థితిలో మాంసపు ముద్దలుగా పడిన తీరు చూస్తుంటే ఆ పేరులు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఇలాంటి సంఘటనలే గత సంవత్సరం  షాద్ నగర్ లో గ్లాస్ కంపెనీలో జరిగిన దుర్ఘటనలో అనేకమంది మరణించిన తర్వాత కూడా అధికారులు అన్ని కంపెనీలు తిరిగి తనిఖీ చేసి భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయా లేదా అని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ సందర్భంగా ఫ్యాక్టరీల యజమానులు,రెవెన్యూ అధికారులు ,పోలీసు అధికారులు ఫ్యాక్టరీల  భద్రత అధికారులు సమిష్టిగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి తక్షణమే షాద్ నగర్ నియోజకవర్గంలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేసి ప్రజలకు కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రజల నుండి ప్రజా సంఘాల నుండి ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన నిరసనలు పోరాటాలు తప్పవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు హెచ్చరించారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా
ఖిలావరంగల్‌: పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా...
ఆదివాసీల‌కి ఆర్గానిక్ మామిడి పండ్లు పంపిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన రథసారథిగా మహబూబ్నగర్ మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ N.రామచంద్ర రావు
లక్ష్మాపూర్ శివాలంలో సీసీ కెమెరాల ఏర్పాటు!
ఇతర మతాలను కించపరుస్తూ పోస్టులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపియస్
గోదావరి నదికి చెందిన ఇసుక రీచ్ ల నుండి స్థానిక సొసైటీల ద్వారా ఇసుక నిలువ చేయడానికి వాహనాలు కావలెను
అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన...