డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
* కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు జీవిస్తున్న భారతదేశంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ అపరిమిత మేదస్సుతో త్యాగంతో రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారానే మనమందరము సమ్మిళితంగా ఐక్యంగా సంఘటితంగా స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. లక్ష్యంతో రూపొందించిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే మార్గదర్శకమైనదని రాజ్యాంగం ద్వారానే రిజర్వేషన్లను కల్పించి ఒకసారి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపినారని కొనియాడారు. మాలల మహా జాతర కార్యక్రమం స్థానిక కొత్తగూడెం క్లబ్ లో అత్యంత వైభవంగా ఎంతో అట్టహాసంగా ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కొందరు మతోన్మాదులు స్వార్ధపరులు కుట్రలు కుతంత్రాలతో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను స్వీకరించాలని ఉద్ఘాటించారు.
మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు మాట్లాడుతూ మాల మహానాడు ఆవిర్భావం నుండి వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత పివి రావు నేతృత్వంలో తాను పనిచేస్తూ వస్తున్నానని మాలలకు అన్ని చోట్ల అన్యాయం జరుగుతున్నదని ఇటీవల జరిగిన వర్గీకరణ శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా న్యాయబద్ధంగా జరిగింది కాదని పరిపాలకులు ఎవరికి వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చేశారని మాలలందరూ ఉవ్వెత్తున ఎగిసి ఉద్యమించి వర్గీకరణలో మాలలకు సహేతుకమైన న్యాయం జరగడానికి పోరాటం చేయాలని అందరూ సంఘటితంగా మాల జాతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హాజరైన లింగాల రవికుమార్ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ సాభాధ్యక్షత వహించిన పూల రవీందర్ మాట్లాడుతూ
భారతదేశ చరిత్రలో మాలలది ఒక ప్రత్యేకమైన స్థానమని మాల జాతిలో జన్మించడం గొప్ప గర్వకారణమని మన భారత రాజ్యాంగాన్ని సృష్టించిన త్యాగధనుడు మానవతావాది సమతా వాది నిన్న జాతుల జీసస్ అయిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాలవాడు కావడం మనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు. అభ్యసించు బోధించు సమీకరించు పోరాడు అని నినందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ సూక్తులను ఆశయాలను మనమందరము ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించి సాధించాలని మాల జాతి మనుగడ కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు నడుంబిగించి ఉద్యమించాలని
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తొలుత నేతలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మాలల మహా జాతరలో జాతీయ మాల మహానాడు అధ్యక్షులు ఎర్రమల రాములు సిపిఐ జిల్లా పార్టీ సెక్రటరీ ఎస్ కే సాబీర్ పాషా జాతీయ అంబేద్కర్ సంక్షేమ బాట అధ్యక్షులు లింగాల రవికుమార్ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్ రాజ్
జిల్లా ఉపాధ్యక్షులు కొప్పరి నవతన్ ఈవెంట్ కండక్టర్ కొరియోగ్రాఫర్ ప్రభు రాజ్ లతో పాటు మాల మహానాడు జిల్లా శిరోమణులు గంధం కల్పన కొచ్చర్ల కమల రాణి కొంచెం లావణ్య బద్దం స్వర్ణలత రిటైర్డ్ ఏఎస్ఐ సంజీవరావు ఖమ్మం ఇంచార్జ్ దామల సత్యం ఖమ్మం అధ్యక్షులు కొప్పుల రామారావు జిల్లా కార్యదర్శి అంతోటి పాల్ ఉపాధ్యాయ ఉద్యమ నేత దుంపల సుధాకర్
మాల మహానాడు నాయకులు పగిడిపల్లి శ్రీకాంత్ పిఎస్ మూర్తి జర్నలిస్టులు సుధాకర్ చిరంజీవి నిమ్మలగూడెం జర్నలిస్టు ఆర్ఎంపీ వైద్యులు తుంపురు శ్రీనివాస్ నిమ్మలగూడెం నుండి బండి వెంకన్న బండి రమేష్ కళాకారులు కాటూరి రాము బృందం అభినవ గద్దర్ పాషా ప్రముఖ యాంకర్ కుమారి శశికళ లతోపాటు టీవీ జర్నలిస్ట్ నరసింహ సౌండ్ సిస్టం మనీ రఘురాం డెకరేషన్ నగేష్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి దాదాపు వెయ్యి మందికి పైగా మాల సోదర సోదరీమణులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

