తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్
తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది
తెలంగాణ హక్కుల కోసం, నీళ్లలో మన వాటా కోసం, ఉద్యోగాల్లో మన జరిగిన అన్యాయం పై ఆయన చేసిన పోరాటం నేటికీ ఆదర్శనీయం
బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వై. రవీందర్ యాదవ్, పార్టీ శ్రేణులు
హాజరైన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ శ్రేణులు
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 21:తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ తొలి దశ ఉద్యమం నాటి నుంచి రాష్ట్ర సాధన సాధ్యమైనంతవరకు తెలంగాణ హక్కుల కోసం నిరంతరం కృషిచేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం షాద్ నగర్ మున్సిపాలిటీ న్యూ సిటీ కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికీ అప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన వైపు తెలంగాణ ప్రజలను మలిపిన ప్రముఖులు జయశంకర్ సార్ అని అన్నారు. 1952 నుంచి నాన్ ముల్కి, ముల్కీ ఉద్యమానికి తెరలేపి సీమాంధ్ర ప్రాంత నేతల ఆధిపత్యాని వ్యతిరేకించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పి విద్యార్థులను, మేధావులను, ఉద్యోగస్తులను తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా అవగాహన కల్పించారని చెప్పారు. సాగునీళ్ళు, ఉద్యోగాలు, నిధులు వంటి అంశాలలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి క్షుణ్ణంగా తెలియజేసి ఉద్యమం వైపు మళ్లించారని ఉపయోగపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సూచనతో కెసిఆర్ సారథ్యంలో జేఏసీని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సాధించుకునే అంతవరకు విశ్రమించకుండా పని చేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంతం ఉన్నంతకాలం ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును మర్చిపోలేరని, ఆయన మన మధ్యలో భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన పేరు మన మనస్సుల్లో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మీనరసింహా రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, చెట్ల నరసింహా, నంద కిషోర్, నాయకులు నక్కల వెంకటేష్ గౌడ్, ఒగ్గు కిషోర్, గాదె సుధాకర్, గోపాల్, నందిగామ శ్రీనివాస్, గౌస్ జానీ, అందె జంగరాజ్, గోపాల్, భిక్షపతి, అందె మహేశ్వర్, భువనేశ్వర్ రెడ్డి, బిలాల్, రాఘవేందర్, రామచందర్, మహమూద్, ఉమాప్రసాద్, అల్లాడ శేఖర్, గుండు అశోక్, శరత్ కృష్ణ, చెర్క శివ, దొడ్డి రవి, సలీం, అశోక్ రెడ్డి, వెంకటేష్ గుప్తా, ఉమారాణి, రాహూఫ్, సుశాంత్, శ్రీనివాస్, వినోద్, ఈశ్వర్, సందీప్ సింగ్, శీలం శ్రీకాంత్, తుప్పుడు నరసింహా, రాజశేఖర్, పాండు, హనుమంతు, విజయ్, సంతోష్ నాయక్, పిల్లి సాయి, సంజు నాయక్, రఘు, తేజ, శీలం సాయి, జగన్ నాయక్, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

