రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ. జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్

రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ. జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్

 

---జిల్లాలో 159,201మంది రైతుల ఖాతాల్లో రూ.185 కోట్ల 69 లక్షల  రైతు భరోసా నిధులు జమ
---ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా నిధులతో రైతుల్లో ఆనందం

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

 రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత మరోసారి రైతు భరోసా నిధుల విడుదలతో వెల్లడైంది. 2025 వానాకాలం లో సాగుకు సిద్ధమవుతున్న ఈ సమయంలో రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేలా ప్రభుత్వం రైతు భరోసా నిధులను జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిధుల ద్వారా విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు సంబంధించి రైతులకు మద్దతు లభించనుండటంతో, చాలా మంది రైతులు ముందుగానే అవసరమైన వ్యవసాయ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా సాగుకు ముందు పెట్టుబడి సాయంగా రైతులకు రైతు భరోసా నిధులు అందడం ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రైతు భరోసా నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు కృతజ్ఞతలు తెలిపారు.ఇ సాగులో జాప్యం కాకుండా సకాలంలో సహాయం అందించడం అభినందనీయమని రైతులు పేర్కొన్నారు. రైతు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలు భవిష్యత్తులో వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, లాభదాయకంగా మార్చనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 2025 సంవత్సరం వానాకాలం సీజన్ కు గానూ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం సోమవారం నుంచి ప్రారంభించింది. ఎకరానికి సంవత్సరం కు 12 వేల రూ. ల చొప్పున వానాకాలం 2025 సీజన్ కు 6 వేల రూ ల చొప్పున రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.జిల్లాలఈ ఇప్పటి వరకు జూన్ 20 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు
1, 59,201 మంది రైతుల ఖాతాల్లో రూ.185 కోట్ల 69 లక్షల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా వ్యవసాయ అధికారి  తెలిపారు. వానాకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలుఇ జూన్ 20 ఉదయం 10 గంటల వరకు జిల్లాలో వానాకాలం 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 13 మండలాల నుంచి 183273మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 262 కోట్ల 03  లక్షల  రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, కాగా ఇప్పటి వరకు 159,201 మంది రైతులకు 185  కోట్ల 69 లక్షల రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగఈ కొనసాగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గుండు మాల్ మండలంలో 6911 మంది రైతులకు 7 కోట్ల 37 లక్షల రూ.లు, కోస్గి   మండలంలో 11025  మంది రైతులకు 11కోట్ల 22 లక్షల  రూ.లు, కొత్తపల్లి మండలంలో 6506 మంది రైతులకు 6 కోట్ల 97 లక్షలు, మద్దూరు   మండలంలోఇ 14001  మంది రైతులకు 14 కోట్ల 50 లక్షల రూ.లు, కృష్ణ  మండలంలో 6906 మంది రైతులకు 9 కోట్ల 94  లక్షల రూ.లు, మాగనూరు   మండలంలో 8164 మంది రైతులకు 11 కోట్ల 39 లక్షల రూ.లు, మక్తల్  మండలంలో 18950 మంది రైతులకు 24 కోట్ల 97 లక్షల రూ.లు, నర్వ మండలంలో 12012 మంది రైతులకు 16 కోట్ల 24 లక్షల ఉ రూ.లు, ఉట్కూరు  మండలంలో 16301 మంది రైతులకు 21 కోట్ల 43  లక్షల రూపాయలు, దామరగిద్ద  మండలము లో 17216 మంది రైతులకు 18 కోట్ల  35 లక్షల రూపాయలు , ధన్వాడ మండలం 10270 మంది రైతులకు 10 కోట్ల 43 లక్షల రూపాయలు, మరికల్ మండలం లో 12266 మంది రైతులకు 13 కోట్ల  42 లక్షల రూపాయలు, నారాయణపేట మండలంలో  18664 మంది రైతులకు 19 కోట్ల 41 లక్షల రూపాయలు    రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కావడం జరిగిందని  తెలిపారు.ప్రారంభంలోనే పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసిన ఈ నగదును జిల్లా లోని  రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News