ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు...
గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం...
డిడి ట్రైబల్ వెల్పర్ అధికారి మనేమ్మ
నమస్తే భారత్: భద్రాచలం
గిరిజన విద్యార్థినీ, విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు అనేక వసతి సౌకర్యాలు కల్పించామని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ అన్నారు. శుక్రవారం నాడు ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ అధికారిక పనులపై వెళ్ళినందున ఆయన ఆదేశాల మేరకు పిఎంఆర్ సి సమావేశం మందిరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న, బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి జిల్లాలోని గిరిజన బాల,బాలికలు, 03,05,08 తరగతులకు కలిపి 437 మంది దరఖాస్తు చేసుకోగా వారిని పిల్లల తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల సమక్షంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా అందరి సమక్షంలో లాటరీ ద్వారా బాల బాలికలను ఎంపిక చేశామని అన్నారు. మూడవ తరగతిలో 38 సీట్లకుగాను లంబాడా తెగకు చెందిన బాలికలకు నలుగురుని, జనరల్ లో బాలికలు మరియు బాలురు ఏడుగురుని, కోయ తెగకు చెందిన బాలికలకు ఎనిమిది మందిని, జనరల్ లో బాలికలు మరియు బాలురకు 15 మందిని, పి వి టి జి తెగకు చెందిన బాలికలకు ఒకటి, జనరల్ లో ఒకటి, ఇతరులకు ఒకటి జనరల్ లో ఒకటి, ఐదవ తరగతిలో 20 సీట్ల గాను లంబడా తెగకు చెందిన బాలికలకు రెండు, జనరల్ లో బాలురు బాలికలు నాలుగు, కోయ తెగకు చెందిన బాలికలకు నాలుగు, జనరల్ లో బాలికలు మరియు బాలురు 08, పి వి టి జి తెగకు జనరల్ బాలికలు మరియు బాలురకు ఒకటి, ఇతరులకు జనరల్ లో బాలికలు మరియు బాలురు ఒకటి, 8వ తరగతిలో లంబాడాకు చెందిన బాలికలు రెండు, జనరల్ లో బాలికలు మరియు బాలురు నాలుగు, కోయ తెగకు చెందిన బాలికలు నాలుగు, జనరల్ లో బాలికలు మరియు బాలురు ఏడు, పి వి టి జి తెగకు చెందిన జనరల్ లో బాలురు మరియు బాలికలకు ఒకటి, ఇతరులకు జనరల్ లో నాలుగు సీట్లను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయడం జరిగిందని,03,05,08 కేటగిరీలలో ఐదుగురిని వెయిటింగ్ లిస్టులో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసామని ఆమె అన్నారు. డ్రాలో సీటు వచ్చిన పిల్లలు ఆయా తరగతులలో చేరకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న పిల్లలకు సీట్లు కేటాయించబడతాయని ఆమె అన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో సీట్లు సంపాదించిన పిల్లలను తప్పనిసరిగా చేర్పించాలని తెలుపుతూ, సీట్లు లభించిన బాల బాలికలకు ఆమె అభినందిస్తూ, బాగా చదివి మీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంఈఓ శ్రీమతి రమ, ఏ సి ఎం ఓ రమేష్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు,డిడి ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం సిబ్బంది రంగయ్య, ప్రసాద్, శ్రీధర్, మణికుమార్, సురేష్, భద్రం మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

