చికటాయపాలెం గ్రామంలో సీసీ రోడ్డు, డ్రెయిన్ & అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన - అభివృద్ధి పథంలో చికటాయపాలెం — మౌలిక వసతులే మా ప్రథమ ధ్యేయం
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చికటాయపాలెం గ్రామంలో, సి ఆర్ ఆర్ నిధుల నుండి మంజూరైన ₹10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ మరియు 12 లక్షల రూ, వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో అభివృద్ధి సంకేతంగా ఈ కార్యక్రమం జరగడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి అనేది సమగ్ర అభివృద్ధికి ఆవశ్యకంగా భావిస్తున్నాం. సీసీ రోడ్డు, డ్రెయిన్ తో ప్రజలకు రాకపోకలు సులభం అవుతాయి. అంగన్వాడీ భవనం ద్వారా చిన్నారులకు మౌలిక విద్య, పోషణ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇది అభివృద్ధిలో ఒక నూతన అధ్యాయంగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ తెలంగాణకు నూతన ఊపిరి అందించేందుకు ప్రభుత్వం చురుగ్గా పని చేస్తోంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లే బాధ్యతను నేనెప్పుడూ మరిచిపోను, అని వారు పేర్కొన్నారు.గ్రామస్థులు అభివృద్ధి పనుల ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ శంకుస్థాపనతో గ్రామంలో వాతావరణం పండగలా మారి, ప్రజల్లో అభివృద్ధి ఆశాజ్యోతి వెలిగింది..
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
