అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి బుద్ధుల జంగయ్య డిమాండ్
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 14:జిల్లేడు చౌదరిగుడా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుద్ధుల జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చెన్నారెడ్డి గూడ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శాఖ సమావేశం రే లింగం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ తో కలసి వచ్చి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు పూర్తిస్థాయిలో అమలు పరచడంలో విఫలమైంతుంది అని ఆయన ఆరోపించారు పేదలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు పూర్తిస్థాయి అమలుపరచడంలో విఫలమైందని అన్నారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కొందరికే అమలవుతుందని
500 కే గ్యాస్ కొందరికి అమలు అవుతుందని ఫుడ్ సెక్యూరిటీ కాడున్న ఉన్నకుటుంబాలలో మహిళకు 2500 ఇస్తామని నేటికి ఇవ్వలేకపోయారని మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సెంటు భూమిలేని కుటుంబాలలో మహిళలకు సంవత్సరానికి 12000 ఏ ఇస్తామని కొందరికే ఈ పథకం అమలవుతుందని రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేస్తామని కొందరికి అమలు అయిందని నేడు ఇందిరమ్మ ఇల్లు కూడా అందరికీ కాకుండా కొందరికే పరిమితం చేసి ఇల్లు పీకి పందిరిసినట్లుగా ఉన్న రేకుల ఇండ్లు రేకుల ఇండ్లు పెంకిటిన్లను కూల్చుకొని ముగ్గులు పోసి పునాదులతో తో వుతున్న పరిస్థితి ఉంది ఆ కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది, అర్హులైన పేదలందరికీ ఈ పథకం ఎందుకు అమలు కావడం లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు బేస్మెంట్ లెవెల్ లెంటల్ లెవెల్ రూఫ్ లెవెల్ స్లాబ్ లెవెల్ నాలుగు విడతలుగా ఈ డబ్బులు అకౌంట్ లో చేస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది కానీ డబ్బులన్నీ ఒకేసారి లబ్ధిదారుల అకౌంట్లో వెయ్యాలని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామ శాఖ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది గ్రామ శాఖ కార్యదర్శిగా రే లింగం సహాయ కార్యదర్శిగా కురువ.రాజు కార్యవర్గ సభ్యులుగా కే జంగయ్య కే చంద్రయ్య రమేష్ కమిటీ సభ్యులుగా బిమయ్యం బుచ్చయ్య మల్లమ్మ మణెమ్మ తదితరులను ఎన్నుకున్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

