సుజాత ఉత్తమ సేవలతో మంచి గుర్తింపు: ఎంపీడీవో మంగాకుమారి 

సుజాత ఉత్తమ సేవలతో మంచి గుర్తింపు: ఎంపీడీవో మంగాకుమారి 


పదవి విరమణ చేసిన చిట్టూరి సుజాత దంపతులకు ఘనంగా సత్కారం 
 నమస్తే భారత్,పోడూరు, జూన్ -30, న్యూస్: పంచాయతీ కార్యదర్శి గా చిట్టూరి సుజాత అందించిన ఉత్తమ సేవలు అభినందనీయమని, సేవలే ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయని  మంగాకుమారి కొనియాడారు. సోమవారం పోడూరు సమావేశ మందిరంలో వద్దిపర్రు పంచాయతీ కార్యదర్శి సుజాత పదవి విరమణ కార్యక్రమం సహా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, సర్పంచులు గ్రామస్తులు సమక్షంలో  ఘనంగా నిర్వహించారు. సుజాత దంపతులకు శాలువాలు, పూలమాలలు, పండ్లు,దుస్తులు, బహుమతులు బహుకరించి ఘనంగా సత్కరించారు. సన్మానంలో కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మంగాకుమారి, తాసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్, ఈ ఓ పి ఆర్ డి ప్రభావతి, మాజీ ఎంపీపీ పెన్మేత్స రామభద్రరాజు, సహ పంచాయత్ కార్యదర్శులు పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం సుజాత అన్నారు. సమయపాలన, సమన్వయం, సహా ఉద్యోగులపై అభిమానం, సమస్యల పరిష్కారంలో చొరవ చురుకుతనం, నైపుణ్యం ఆమె 42 ఏళ్ల ఉద్యోగ సేవలలో మేమంతా నేర్చుకున్న ఎన్నో అనుభవాలు అన్నారు. ఆమె పదవి విరమణతో ఏర్పడిన దూరం తీరని లోటు అన్నారు. పదవి విరమణ కాలమంతా దేవుడు వారికి వారి కుటుంబానికి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను దయచేసి సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. సుజాత భర్త చిట్టూరి వెంకటేశ్వరరావు దేవదాయ శాఖలో ఈవోగా పనిచేసే పదవి విరమణ చేశారన్నారు. వేండ్రలో జన్మించిన సుజాత కడలి అప్పారావు, పార్వతీదేవుల మూడవ కుమార్తె. సుజాత వెంకటేశ్వరరావు దంపతులకు కుమారుడు చంద్ర కిరణ్, కోడలు నీరజ, కుమార్తె జక్కం శెట్టి సూర్య కళ, అల్లుడు క్రాంతి కుమార్. వీరికి ఇద్దరు మనవరాలు. వీరంతా దంపతులు సత్కరించి వారి నుంచి  ఆశీస్సులు పొందారు. దంపతులు మాట్లాడుతూ ఆత్మీయ లేని ఎందరో సహ ఉద్యోగులు, అధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మరుపురాని గుర్తుగా మా జీవితంలో మిగులుతుందని అభివర్ణించారు. కార్యక్రమంలో రావుపాడు సర్పంచి పెన్మెత్స విజయలక్ష్మి, రంగరాజు దంపతులు, వద్దిపర్రు సర్పంచి వడ్లపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీపీ  పెన్మెత్స రామభద్ర రాజు,  ఎంపీపీ సుమంగళి, ఉద్యోగస్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేషెంట్లకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు పేషెంట్లకు సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలి.. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 7  వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ...
మత సామరస్యానికి ప్రతీక మొహర్రం : సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పటేల్
నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నరు : పుట్ట మధుకర్
బోధన్‌లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
మంత్రులు హాజరైన సభలో వినిపించని జాతీయ గీతం
మంత్రి పదవిపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
వారిపై దాడి చేశారో ఖబడ్దార్.. బీఆర్‌ఎస్‌కు రామచందర్ రావు వార్నింగ్