రాష్ట్రం లో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
9వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించిన ముఖ్యమంత్రి
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జెల్ పల్లి నరేందర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
నమస్తే భారత్ ప్రతినిధి , రాజేంద్రనగర్, జూన్ 26. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి దిశగా ముఖ్యమంత్రి చర్యలు చేపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెల్ పల్లి నరేందర్, శంషాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ సంజయ్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద శంషాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ కంటెస్టెడ్ జెడ్పిటిసి గడ్డం విజయ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా పేల్చి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జెల్ పల్లి నరేందర్, సంజయ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతుల ఖాతాలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా కింద అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తుండడం ప్రజల కళ్ళల్లో ఆనందం నిండిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నారని ఇది ప్రచారం చేయక పాలన అని, ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందుల గురికానవసరం లేదని ముఖ్యమంత్రి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు, ఎంపిటిసి గౌతమ్ అశోక్ , సులోచన , గణేష్ నాయక్ బొబ్బిలి శేఖర్ కౌన్సిలర్ తాజ్ బాబా, కారుకొండ రమేష్, నరసింహ ముదిరాజ్ రవీందర్ నాయక్ రవి నాయక్ మిట్టు గారు,శేఖర్ గుప్తా, నేరటి నరసింహ భాస్కర్ రెడ్డి సర్పంచ్ రాముల నాయక్ జగన్నాథం రఘు బిర్లా కృష్ణ లింగం గౌడ్ మల్లేష్ యాదవ్ ఉమా మహేశ్వర్ శ్రీనివాస్ యాదవ్ ch శేఖర్ యాదవ్ శ్రీరాములు రాకేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంజు పాండు యాదవ్ ప్రభాకర్ ఇంద్రసేన శ్రీనాథ్ ఇమ్రాన్ ఎన్ ఎస్ యూ ఐ నాయకులు వర్ధన్ జగదీష్ అభిషేక్ ప్రసాద్ ప్రభు చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

