జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్
నమస్తే భారత్. రాజేంద్రనగర్ గండిపేట్ జులై 10): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సైదులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాజేంద్రనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం గండిపేట మండల పరిధిలోని ఖానాపూర్లో నియోజకవర్గ అధ్యక్షులు ఏ. గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ పాల్గొన్నారు. యూనియన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇ. బుచ్చన్న కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఎం. సైదులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.
సమాజంలో 'ఫోర్త్ ఎస్టేట్'గా పిలువబడుతున్న మీడియా రంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల అందులో పనిచేస్తున్న జర్నలిస్టుల జీవితాలు ఆగమవుతున్నాయని సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు రాసే క్రమంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు.
ప్రభుత్వ హామీలు గాలికేనా?
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఇళ్ల స్థలాలు, కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వలేదని సైదులు గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనం, పెన్షన్, హెల్త్ కార్డులు, పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో యూనియన్లకతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి:
నేషనల్ కమిటీ సభ్యులు బి. దేవేందర్ మాట్లాడుతూ, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదును పెంచాలని సూచించారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యక్ష, కార్యదర్శులు ఏ. గోపాల్, ఇ. బుచ్చన్న మాట్లాడుతూ, రాజేంద్రనగర్ నియోజకవర్గం జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతిపాదించిన పలు తీర్మానాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే. సుదర్శన్ గౌడ్, ఎం. శ్రీనివాస్, సలహాదారు కే. యాదయ్య, ఉపాధ్యక్షులు ఇ. ప్రభాకర్, పి. మాధవాచారి, సహాయ కార్యదర్శులు పి. యాదగిరి, ఎం. శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఆర్. జ్ఞానేశ్వర్, ఎం. విజయ్, ఎం. కిట్టు ప్రసాద్, సుధీర్ కుమార్, అనిల్ కుమార్, జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
