గుణాత్మక విద్యను పెంపొందించడం కోసం...
కనీస సామర్ధ్యాలను విద్యార్థుల్లో మెరుగు పరచాలంటే...
ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరం...
ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల్లోఐటిడిఎపిఓబి రాహుల్
నమస్తే భారత్: భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గుణాత్మక విద్యను పెంపొందించడం కోసం కనీస సామర్థ్యాలను విద్యార్థుల్లో మెరుగు పరిచి, పిల్లల బేస్ లెవెల్ పునాది గట్టిగా ఉండాలంటే నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఉద్దీపకం వర్క్ బుక్ రూపొందించి అమలు చేయడం వలన చాలావరకు విద్యార్థులలో అవగాహన పెరిగి బేస్ లెవెల్ పదాలు గుర్తించి రాయగలుగుతున్నారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. గురువారం నాడు భద్రాచలంలోని బీఈడీ కళాశాలలో ఏ హెచ్ ఎస్, ఏపీఎస్ ,జిపిఎస్ పాఠశాలలలో పనిచేయుచున్న ఎస్జిటీ టీచర్లకు ఉద్దీపకం వర్క్ బుక్స్-2 పై ఇంగ్లీష్ మీడియం లో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలలో జిపిఎస్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినందున విద్యార్థులకు కనీస సామర్థ్యాలు అర్థమయ్యే రీతిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే సలహాలు సూచనలు తీసుకొని ఈ ఉద్దీపకం వర్క్ బుక్స్ రూపొందించడం వలన మూడు నాలుగు ఐదు తరగతి పిల్లలకు గుణకాహారాలు బాగాహారాలు, పిల్లల యొక్క విద్య పరంగా నైపుణ్యాలు కొంతవరకు పిల్లలు అర్థం చేసుకొని సొంతంగా చదవడం రాయడం మరియు వాటి సారాంశాలు చెప్పగలుగుతున్నారని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయుచున్న ఎస్జిటి టీచర్ల ద్వారానే ఈ ఉద్దీపకం-2 వర్క్ బుక్ రూపొందించడం జరిగిందని అన్నారు. దీనిలోని అంశాలు చాలా సులభంగా విద్యార్థులు అవగాహన చేసుకునే విధంగా ఒకటి, రెండవ తరగతి పిల్లలకు తెలుగు, మూడవ తరగతి నుండి ఏడవ తరగతి పిల్లలకు ఇంగ్లీషు గణితం వర్క్ బుక్ రూపంలో అందించడం జరిగిందని, ఉపాధ్యాయులు శిక్షణను వినియోగించుకొని, ఏ పిల్లలైతే చదువు పట్ల వెనుకబడి ఉన్నారో వారిని గుర్తించి బాగా చదివే పిల్లల దగ్గర కూర్చోబెట్టి చెప్పించాలని అన్నారు.మనం పని చేస్తున్నది పిల్లల భవిష్యత్తు కోసం అని మీ సొంత పిల్లల చదువుకు ఎలా శ్రద్ధ చూపుతారో గిరిజన పిల్లలను కూడా మీ సొంత బిడ్డల్లా భావించి వారి విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని అన్నారు. రెండవ విడత తయారు చేసిన ఉద్దీపకం వర్క్ బుక్ ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకు చదువుకునే పిల్లలకు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని ఇందులో పొందుపరిచిన ప్రతి అంశం విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా విద్యాబోధన చేస్తే మనం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని, అందుకు హెచ్ఎం తో మొదలుకొని టీచర్లందరూ అలసత్వం ప్రదర్శించకుండా ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి అంశం కులంకషంగా విద్యార్థులలో స్ఫూర్తి నింపి బాగా చదువుకునేలా చేయాలని అన్నారు. ప్రస్తుతం మనం రూపొందించిన ఉద్దీపకం వర్క్ బుక్-2 ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ మంత్రుల చేత ప్రారంభించడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం మన రూపొందించిన కెరీర్ గైడెన్స్, ఉద్దీపకం వర్క్ బుక్ కమిషనర్ దృష్టికి వెళ్లగానే ఎంతో సంతోషించి రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏలకు ఇదే తరహాలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కలిగించేలా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేశారని అన్నారు. మనం చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులలో విద్యా పరంగా మార్పులు వస్తే మనం పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లేనని, మంత్రులు గాని, శాసనసభ్యులుగాని, ఇతర అధికారులు గానీ మన పాఠశాలకు సందర్శనకు వచ్చినప్పుడు వారు అడిగిన ప్రతి ప్రశ్నకు విద్యార్థులు సమాధానం చెప్పే విధంగా విద్యార్థులను తీర్చిదిద్ది మన పాఠశాలలను అగ్ర భాగాన నిలపాలని ఆయన అన్నారు. అనంతరం బీఈడీ కళాశాల, డీఎడ్ కళాశాల డార్మెటరీ గదులను పరిశీలించి ఏమైనా మైనర్ రిపేర్ లు ఉంటే ప్రతిపాదనలు తయారుచేసి తనకు సమర్పించాలని ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ వీరు నాయక్, ఏ సి ఎం ఓ లు రమేష్, శ్రీరాములు, ఏటీడీవోలు అశోక్ కుమార్, రాధమ్మ, సిఆర్పిలు వరబాబు, శంకర్, మోతిలాల్, జి సి డి ఓ అలివేలు మంగతాయారు మరియు ఏపీఎస్, జిపిఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
