నిర్ణీత గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్

నిర్ణీత గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

నారాయణపేట జిల్లాలోని  కొత్త మండలాలైన  గుండుమాల్,  కొత్తపల్లి ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను  బుధవారం  కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  పరిశీలించారు. ఒక్కో మండల కాంప్లెక్స్ భవన నిర్మాణాన్ని రూ. 8.80 కోట్ల వ్యయంతో చేపట్టనుండగా  గుండుమల్  పిహెచ్ సి పక్కన గల రెండు ఎకరాల స్థలంలో నిర్మించే మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులను  కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే ఉన్నాయని వేగంగా పనులు చేయించాలని అధికారులను ఆమె ఆదేశించారు. తర్వాత కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని వేయి గజాల స్థలంలో కొనసాగుతున్న కొత్తపల్లి మండలం  ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్  నిర్మాణ పనులను సైతం కలెక్టర్ పరిశీలించారు. మండల కాంప్లెక్స్ బేస్ మెంట్ కంటే ఇటీవల వేసిన బీటీ రోడ్డు ఎత్తు కావడంతో కాంప్లెక్స్  భవనం  కిందకు అవుతుందని, రోడ్డుకు సమాన ఎత్తులో కాంప్లెక్స్ భవన బేస్ మెంట్ ను పెంచాలని అధికార పార్టీ నాయకులు కలెక్టర్, కడ ప్రత్యేక అధికారిని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బేస్ మెంట్ ఎత్తు పెంచడం వీలవుతుందా అని పంచాయతీరాజ్ అధికారులు అడిగారు. నిబంధనల ప్రకారం ఎత్తు పెంచడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు.  సమీపంలోనే చెరువు ఉందని, ఆ చెరువు నీళ్లు కూడా మండల కాంప్లెక్స్ ఆవరణలోకి వచ్చే అవకాశం ఉందని నాయకులు చెప్పడంతో స్పందించిన కలెక్టర్ ఇరిగేషన్ అధికారుల రిపోర్ట్ తీసుకోవాలని, పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపి పరిష్కార మార్గం చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ సంతృప్తి  

గుండుమల్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి తో కలిసి పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంతృప్తి వ్యక్తం చేశారు.   
ఫైలెట్  గ్రామమైన ముదిరెడ్డి పల్లి కి మొత్తం 129 ఇందిరమ్మ  ఇండ్లు మంజూరు కాగా, దాదాపు 40 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిలో ఆరు ఇండ్ల నిర్మాణాలు స్లాబ్ దశ కూడా పూర్తయ్యాయి. 80 శాతం పనులు పూర్తయిన నాలుగు ఇందిరమ్మ ఇండ్ల లోకి వెళ్లిన కలెక్టర్ మిగతా గ్రామాలతో పోలిస్తే ఇక్కడ నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతున్నాయని లబ్ధిదారులను ఆమె అభినందించారు. గ్రామంలో ప్రారంభం కానీ మిగతా ఇండ్ల నిర్మాణాలను కూడా త్వరగా మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు.

జూనియర్ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన

కొత్తపల్లి మండలం భూనేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న కొత్తపల్లి మండల  ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెరగాలని, నిర్మిత గడువు లోపు కళాశాల భవన నిర్మాణం పూర్తి కావాలని ఆమె ఆదేశించారు. భూనేడు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అప్పుడే ప్రారంభం కావడంతో  విద్యార్థుల వద్దకు వెళ్లిన కలెక్టర్ భోజనం నాణ్యతగా ఉందా? లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారంలో ఎన్ని సార్లు గుడ్లు ఇస్తున్నారని  ఆరా తీశారు. పాఠశాలలో గతేడాది ఉత్తీర్ణత శాతం కంటే ఈ సారి మెరుగు పరచాలని హెవ్ ఎం కు సూచించారు. పాఠశాలలో ఈ సారి విద్యార్థుల సంఖ్య ఎంత పెరిగిందని ప్రశ్నించగా గతేడాది 426 మంది విద్యార్థులు ఉండగా ఈ సారి 438 మంది విద్యార్థులు ఉన్నారని హెచ్ ఎం కలెక్టర్ కు తెలిపారు. 
ఆయా  కార్యక్రమాల్లో  కొత్తపల్లి , గుండుమాల్ తహాసీల్దార్లు జయ రాములు, భాస్కర స్వామి, గుండుమల్ ప్రత్యేక అధికారి రెహమాన్,  పీ ఆర్ డీఈ విలోక్, ఆయా మండలాల ఎంపీవోలు, సంబoధిత అధికారులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు
వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ఆ వరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని...
బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు..
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లితో కలిసి తండ్రిని చంపిన కూతురు
మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.
ఇజ్రాయెల్‌ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
వెదజల్లే పద్దతితో అధిక దిగుబడి