కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం

 

తెలంగాణ వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల  జంగయ్య విమర్శ

నమస్తే భారత్ షాద్ నగర్ జులై09:కార్మికుల హక్కులను కాలరాస్తుంది కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య విమర్శించారు ఈ సందర్భంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా చౌదర్ గూడా మండల కేంద్రం నుంచి కొందుర్గు వరకు సిపిఐ చౌదర్ గూడా మండల కార్యదర్శి జిల్లెల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో  మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు 40 రకాల కార్మిక చట్టాలు ఉండేదని పారిశ్రామికవేత్తలకు తలవొంగి 40 లేబర్ చట్టాలను నాలుగు కోడ్లు గావిభజించి అమలు పరచడానికి యోచిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన ఆరోపించారు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారు వ్యాపార కుబేరులు ఆదాని అంబానీలకు రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్టులను ఓడరేవులను ఇలా ఒక్కొక్కటిగా అన్నిటిని దారా దత్తం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తుదీ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఆయన దుయ్యబట్టారు కార్మికులకు కనీస వేతనం లేదు ఎనిమిది గంటల పని దినం లేదు పిఎఫ్ ఈఎస్ఐ లేదు వెట్టి చాకిరి చేయించుకుంటుంది యజమాని అలాంటి పరిశ్రమలకు మోదీ ప్రభుత్వం మద్దతుగా నిలబడ్డదని ఎండగట్టారు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కోత విధించి ఉద్యోగులను తగ్గించి రోజురోజుకు నిర్వీర్య పరుస్తూ మాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎత్తిసే ఆలోచన చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అన్నారు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కులతత్వం ప్రాంతీయతత్వం మతతత్వాన్ని రెచ్ఛగోడుతూ పబ్బం గడుపుకుంటుందని దీని ప్రజల అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు రాబోవు కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను క్రిస్టియన్ మైనార్టీలను ఎస్సీలను ఎస్టీలను ఎవర్ని కూడా ప్రశాంతంగా భారతదేశంలో జీవించే విధంగా చేసే పరిస్థితి లేదు. అందరిపై దాడులు చేసే పన్నాగం పన్నుతుందని దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకే బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా యావత్ కార్మికులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బికే ఎం యు జిల్లా కోశాధికారి ఎం కృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వీరేశం గోపాల్ రమేష్ తిరుమలేష్ రాము పాపయ్య సి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు ఆత్మహత్యా యత్నం.. కేసు నమోదు
వినాయక్ నగర్ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ఆ వరణలో బాలాజీ అనే యువకుడు ఒంటిపై డిజిల్‌ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. నగరంలోని...
బ్రిడ్జి కూలిన ఘటనలో 15కు పెరిగిన మృతుల సంఖ్య.. గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
కిష్టారెడ్డిపేటలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు..
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తల్లితో కలిసి తండ్రిని చంపిన కూతురు
మొన్న 90 డిగ్రీలు, పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్‌.
ఇజ్రాయెల్‌ దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు మృతి
వెదజల్లే పద్దతితో అధిక దిగుబడి