మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భగీరథుడు 

మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భగీరథుడు 

 

ఆయన ఆలోచన విధానంతోనే సాగునీటి కల సహకారం 

కాంగ్రెస్ కక్ష కట్టి వేధింపులకు దిగడం సరికాదు 

కాలేశ్వరం ప్రాజెక్టు చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది 

లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాలేశ్వరo ప్రాజెక్టుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుంది 

బీఆర్ఎస్ యువనేత వై. రవీందర్ యాదవ్ 

కాలేశ్వరం ప్రాజెక్టు విచారణకు హాజరవుతున్న అధినేత కేసిఆర్ కు మద్దతుగా  షాద్ నగర్ నుండి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 11:మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అపర భగీరథుడని బీఆర్ఎస్ యువ నాయకుడు వై.రవీందర్ యాదవ్ అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు విచారణకు హాజరవుతున్న అధినేత కేసిఆర్ కు మద్దతుగా  మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సూచన మేరకు నియోజకవర్గ నేతలు వై. రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్కే భవన్ కు బయలుదేరిన సందర్భంగా మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీలు లేక, త్రాగునీలు లేక హరిగోశపడ్డ తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తూ, స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కలను నెరవేర్చిన మహానుభావుడు, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సారథి కెసిఆర్ అని కొనియాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఇంజనిర్ల, రిటైర్డ్ ఇంజనీర్ల పూర్తి సలహాలు సూచనల మేరకు కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీ అందిస్తుంటే, అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి, బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారాలకు తెరలిపిందని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పనితీరు, ఫలితాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయిందని, తెలంగాణ రైతాంగం హర్షస్తుంటే కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణంపై కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తుందని ఆరోపించారు. ప్రాజెక్టు పలితాలను చూడకుండా అవినీతికి పాల్పడ్డారంటూ విష ప్రచారానికి తెరలేపి, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండపడ్డారు. విచారణ పేరుతో కేసీఆర్, హరీష్ రావు, ఇతర మాజీ ఉన్నతాధికారులను  ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టు ఫలితం ఏంటిదో మన ప్రజలకు,రైతులకు తెలుసని చెప్పారు. విచారణకు హాజరవుతున్న అధినేత కేసిఆర్ కు మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులకు, పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్నది మన ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం తిప్పి కొట్టి ప్రజల పండగ ఉండవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. వందలాది మంది కార్యకర్తలు, రైతులు షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి బీఆర్కే భవన్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బ్లాక్‌ బాక్స్‌ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా బ్లాక్‌ బాక్స్‌ ఇంకా దొరకలేదు : ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల్లోనే బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ...
అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. విజ‌య్ రూపానీకి క‌లిసిరాని ల‌క్కీ నెంబ‌ర్ !
అంగన్వాడీ బడి బాట
ఎంపీపీఎస్ సీతారాంపురం పాఠశాలలో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశం
ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు చదువుతూ ప్రయోజకులవుతారని ఆశిస్తూ, ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అన్నారు..
ఖమ్మం బీజేపీ జిల్లా కార్యశాల ఇంచార్జ్ గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య
క్యాన్సర్ పేషెంట్ కు వసుధ ఫౌండేషన్ రూ.10వేల ఆర్థిక సాయం అందజేత*