ఖమ్మం బీజేపీ జిల్లా కార్యశాల ఇంచార్జ్ గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య

తెలంగాణకు బీజేపీ శుభఫలితాలు
తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ భాగస్వామ్యం 11 ఏళ్ల కేంద్ర పాలనలో విప్లవాత్మక మార్పులు
ఖమ్మంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 12:భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిన సేవలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రైల్వే-రోడ్లు, ఆరోగ్య రంగంలో చేసిన విప్లవాత్మక మార్పులపై ఖమ్మం లో ఒక ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య హాజరయ్యారు. ఆయనకు ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు ఘన స్వాగతం తెలిపారు. పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన 5 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా బాబయ్య మాట్లాడుతూ “ఈ 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో రైతు నుండి రిక్షా వాడివరకు, యువత నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కేంద్రం చేసే మేలు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నా – ప్రజలు కేంద్రం చేసిన అభివృద్ధిని గుర్తుంచుకుంటున్నారు.” అని చెప్పారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమైన పథకాలు పి ఎమ్ కిషన్ 31.3 లక్షల మంది రైతులకు ₹312 కోట్ల రూపాయల సాయం.ముద్రా యోజన తెలంగాణలో 76 లక్షల మందికి రూ. 72,000 కోట్లకు పైగా లోన్లు.జన్ ధన్: 1.27 కోట్ల ఖాతాలు – బదులుగా ప్రత్యక్ష నిధుల జమ.శ్వానిది: రోడ్డుపై వ్యాపారం చేసే వారికి 4.26 లక్షల రుణాలు. పీ ఎమ్ ఏ వై– పట్టణ/గ్రామీణ: లక్షల మంది కుటుంబాలకు ఉచితంగా ఇళ్లు. పి ఎమ్ జి ఎస్ వై: గ్రామ రహదారులకు ₹12,800 కోట్ల వ్యయం.ఆయుష్మాన్ భారత్: ఆరోగ్య భద్రత కోసం 82 లక్షల మంది లబ్ధిదారులు.ఉజ్వలా యోజన: 11 లక్షల ఎల్ పి జి కనెక్షన్లు.పి ఎమ్ జి కె ఏ వై : కోవిడ్ సమయంలో ఉచిత రేషన్; 5.67 లక్షల ఏ ఏ వై కుటుంబాలకు ప్రయోజనం.ఎమ్ జి ఎన్ ఆర్ ఈ జి ఎస్: 56 లక్షల మందికి ఉపాధి అవకాశాలు.స్వచ్ఛ భారత్: లక్షలమంది ఇంటింటికీ మరుగుదొడ్లు.ప్రత్యేక ప్రాజెక్టులు – అభివృద్ధి దిశగా మైలురాళ్లు:రైల్వే: 8,000 కోట్ల రూపాయలతో కొత్త మార్గాలు – కాజీపేట-వర్ధా, మేడ్చల్-మనోహరాబాద్, సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్ విస్తరణ ఎమ్ ఎమ్ టి ఎస్ ఫేజ్-2 పూర్తి – 1100 కోట్లతో 90% పనులు ముగింపు దశలో.రోడ్లు: 2,600 కి.మీ. జాతీయ రహదారులు – ₹1.25 లక్షల కోట్ల వ్యయం.బహుళ మోడల్ పారిశ్రామిక పార్కులు: జహీరాబాద్, బోధన్, మహబూబ్నగర్లో అభివృద్ధి.రామ్గుండం యూరియా ఫ్యాక్టరీ పునర్నిర్మాణం – ₹6,338 కోట్లు.హైదరాబాద్కు ఐ ఐ ఎమ్,ఐ ఐ ఎస్ ఈ ఆర్, ఐ ఐ ఎస్ ఇ ఆర్ ఎన్ ఎస్ టి ఐ లాంటి అగ్రశ్రేణి విద్యా, శిక్షణ సంస్థలు.లైఫ్ సైన్సెస్, ఎల్ పి జి గోడౌన్లు, ఇన్నోవేషన్ హబ్, టెలికం క్లస్టర్లు ఏర్పాటు.సమ్మేళనం ముగింపులో బాబయ్య మీడియాతో మాట్లాడుతూ “కేంద్ర బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది మాటలతో కాదు – ఫలితాలతో. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని దిద్దుకుంటుంది. ప్రజల ఆశీర్వాదంతో సత్యం వెలుగులోకి వస్తుంది” అని అన్నారు.ఈ సమావేశంలో బీజేపీ ఖమ్మం జిల్లా నాయకులు, యువ మోర్చా సభ్యులు, మహిళా మోర్చా, బీసీ మోర్చా, మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels


Latest News
