స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం
--- మద్దూరు మండల బిజెపి అధ్యక్షులు శంకర్
నమస్తే భారత్ / మద్దూరు( జూన్ 10 ) :
మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్ లో మంగళవారం మండల బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూరు విజయవంతమైన నేపథ్యంలో మన బలగాల సౌర్య కార్యక్రమాలను ప్రశంసిస్తూ, 11 ఏళ్ల మోదీ పాలన విజయాలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించనైనది.
ప్రస్తుత కాంగ్రెస్, గత బిఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించనైనది. మరియు 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సహకారం సా వివిధ పార్టీ కార్యక్రమంలో కార్య ప్రణాళిక ను జూన్ 12 నుంచి 14 వరకు జరిగే మండల సంకల్ప సభలు పెద్ద ఎత్తున బిజెపి కుటుంబ సభ్యులు వచ్చి విజయం అయ్యేవిధంగా చేయాలని కోరడమైనది.
అలాగే మండల వివిధ మోర్చా కమిటీలను, పన్నా ప్రముఖ సహా పూర్తిస్థాయిలో మండల కార్యవర్గం కమిటీని పూర్తిచేయాలని నిర్ణయించడం జరిగింది.
ప్రతి నెలలో ఒకసారి మండల పదాధికారుల సమావేశం మూడు నెలలకు ఒకసారి మండల కార్యవర్గ సమావేశం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది.
మండల స్థాయిలో ప్రజల సమస్యలపై ప్రతి నెలలో కనీసం ఒకసారి మండల పదాధికారుల సమావేశం, మూడు నెలలకు ఒకసారి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడంతోపాటు సమస్యలకు పరిష్కార దిశగా పయనించాలని తెలియజేశారు.
మండల స్థాయిలో అన్ని ఎన్నికలలో గెలిచే వ్యూహాలు రచించాలని తినడం జరిగింది.
రాష్ట్ర బిజెపి పార్టీ మరియు జిల్లా బిజెపి పార్టీ ఆదేశాల మేరకు మద్దూరు మండల నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మండల నూతన కార్యవర్గ సభ్యుల జాబితాను విడుదలను నారాయణపేట జిల్లా బిజెపి అధ్యక్షులు సత్య యాదవ్ అనుమతి మేరకు మండల సమావేశంలో విడుదల చేయడం జరిగింది.
మండల ఉపాధ్యక్షులుగా రేణుక, లక్ష్మీ, డీకే భరత్, కాశీనాథ్, మండల ప్రధాన కార్యదర్శులుగా టీ సాయిలు, బి రవి కుమార్,
మండల కార్యదర్శిగా కృష్ణవేణి, కురుమమ్మ, మాధవులు, సుతారి విజయ్ లక్ష్మి, ట్రెజరర్ గా రాఘవేందర్ కె మండల సభ్యులుగా సుధా, శ్రీనివాస్ నాయక్, అశ్విని యాదవ్, రామ్ రెడ్డి, హరీష్ గౌడ్, భాగ్యమ్మ, వెంకటేష్, తదితరులు మండల కమిటీ మొత్తం 46 సభ్యులతో మండల కమిటీ జాబితాను విడుదల చేయడమైనది.
ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు మదన్ మద్దూరు మండల అధ్యక్షులు శంకర్ కే, మద్దూరు మండల మాజీ ఉపాధ్యక్షులు సుజాత, కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షులు డీకే భరత్ రేణుక, కోశాధికారి రాఘవేందర్ కే, బూత్ అధ్యక్షులు ఆర్ భరత్, జోగు అనిల్, తలారి శ్రీనివాస్, కురువ రాము, బాలకృష్ణ, ప్రశాంత్, లక్ష్మణ్ నాయక్, సీనియర్ నాయకులు చెన్నారెడ్డి, సి సిద్ధప్ప, చిన్న సాయప్ప, బుగ్గప్ప, హనుమంతు, ఆశప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

