విద్యను మళ్లీ ప్రారంభించుకోండి – ఓపెన్ స్కూల్ ద్వారా భవిష్యత్తు నిర్మించుకోండి- అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ .
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా పాఠశాల స్థాయిలోనే చదువును మానివేసినవారికి లేదా పదోతరగతి పూర్తయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కొనసాగించలేక పోయినవారికి తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) మళ్లీ చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వారు రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ విధానంలో చేరినవారు తమ ఉపాధి మార్గాలను వదులుకోకుండా ఖాళీ సమయాల్లో పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తూ, పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రామాణికమైన విద్యార్హతను పొందవచ్చు అని తెలిపారు. రెగ్యులర్ పాఠశాలలలో చదివినవారి సర్టిఫికెట్లతో సమానమైన గుర్తింపు ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు కలిగి ఉంటాయి అన్నారు. ఓపెన్ విధానంలో కేవలం ఐదు సబ్జెక్టులతో పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించవచ్చు అని, ఇంటర్మీడియట్ను ఒకే సంవత్సరంలో పూర్తిచేసుకునే అవకాశమూ ఉంటుంది అన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను ఓపెన్ స్కూల్ కేంద్రాల ద్వారా ఉచితంగా అందజేస్తారు అని తెలియజేశారు.
ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ పొందేందుకు 2025 ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాలు నిండినవారు పదోతరగతికి అర్హులు కాగా, 15 సంవత్సరాలు వయస్సు నిండినవారు, పదోతరగతి ఉత్తీర్ణులైనవారు ఇంటర్మీడియట్కు అర్హులు. వయస్సు ధృవీకరణ పత్రంగా టి.సి., రేషన్ కార్డు లేదా సంబంధిత అధికారులిచ్చిన పుట్టినతేదీ ధృవీకరణ పత్రం సరిపోతుంది అని తెలిపారు . అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు 31 జూలై 2025 లోపు స్వీకరించబడతాయి అన్నారు. అనంతరం 01 ఆగస్టు 2025 నుండి 28 ఆగస్టు 2025 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. పదోతరగతికి రూ.100, ఇంటర్మీడియట్కు రూ.200గా రిజిస్ట్రేషన్ రుసుము నిర్దేశించబడింది. ఆసక్తి గలవారు మరిన్ని వివరాలకు www.telanganaopenschool.org వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మద్దినేని పాపారావును సెల్ నెంబర్ 8008403522 లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,మద్దినేని పాపారావు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్, పరిశ్రమల శాఖ అధికారి పృథ్వి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
