చట్టప్రకారం నేరస్తులకు శిక్ష పడేవిదంగా కృషి చేయాలి. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్.

చట్టప్రకారం నేరస్తులకు శిక్ష పడేవిదంగా కృషి చేయాలి. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐ పి యస్.

2bad0454-b30b-4294-bee3-158c5cdcb0bc

---నేరాల నియంత్రణ పై దృష్టి సారించాలి.

---ప్రతి కేసును పారదర్శకంగా విచారణ చేపట్టాలి.

---పాత నేరస్తులు, రౌడీలు సస్పెక్ట్ లపై నిఘా ఏర్పాటు చేయాలి.

---రాబోయే పండగలు,లోకల్ ఎలక్షన్స్ కు సిద్ధంగా ఉండాలి.

---ప్రజలకు సామాజిక అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమలు నిర్వహించాలి.

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

జిల్లాలో నమోదు అయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి పకడ్బందీగా ఇంటరాగేషన్ రిపోర్ట్ తయారు చేసి కోర్టు లో చార్జి షీట్ వేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలనీ జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్  తెలిపారు.ఈ రోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోనీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ గారు, జిల్లా పోలీస్ అధికారులతో  నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్లో ఉన్న  గ్రేవ్, నాన్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను న్యాయ అధికారులు, డాక్టర్స్ తో సమన్వయం కలిగి ఉండి పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.కేసుల సమగ్ర విచారణ ద్వార నిందితులకు శిక్ష పడేవిధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు అందరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే పిర్యధుదారులతో  మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచారాధని సూచించారు. జిల్లా పరిధిలో మిస్సింగ్ కేసులను వెంటనే పట్టుకోవాలని అన్నారు.
అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలి అన్నారు ఫోక్సో, ఎస్సీ ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్షీ షీట్ దాఖలు చేయాలన్నారు.
నేరాలు జరిగే ప్రదేశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు హాట్ స్పాట్ గా గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది ప్రతి పాయింట్ బుక్ ను తనిఖి చేసేటట్లు చూసుకోవాలని సూచించారు. పాత నైరస్తులు, రౌడీలు, సస్పెక్ట్ ల కదలికల పై నిఘా ఏర్పాటు చేసి వారిని ప్రతి రోజు తనిఖీ చేస్తూ ఉండాలని తెలిపారు. అక్రమ గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గుట్కాలు,ఇసుక, పిడియస్ రైస్ అక్రమ దందాల పై నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో బాగంగా పట్టణాలలో, గ్రామాలలో సీసీ కెమెరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి సీసీ  కెమెరాలు స్వచ్ఛందంగా  ఏర్పాటు చేసుకునేల చూడాలని తెలిపారు. సామాజిక అంశాలపై, సైబర్ నేరాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాబోయే లోకల్ ఎలక్షన్స్ మరియు గణేష్ ఉత్సవాలకు సంబంధించి ముందస్తు సంసిద్ధంగా ఉండాలని ప్రజలతో మమేకం అవుతూ గ్రామాలలో సమస్యలు తెలుసుకొని, సమాచారని సేకరించాలని తెలిపారు. అలాగే మత ఘర్షణలకు సంబంధించి పాత నేరస్తుల పై నిఘా ఉంచి తనిఖీ నిర్వహించాలని సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేయాలి అని ఎస్పీ  తెలిపారు.
ముసురు వర్షాల నుండి ప్రజలు అప్రమతంగా ఉండాలి: ఎస్పీ.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని, మిద్దీన్లలో లోతట్టు ప్రాంతాలలో ఉండారాదని తెలిపారు. పోలీసు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో డయల్100 కాల్స్ వస్తె  తక్షణమే స్పందించాలని తెలిపారు. అలాగే పిల్లలు నదులు, కుంటలు, చెరువులు, వాగుల వద్దకు చేపలు పట్టడానికి , ఈత కొట్టడానికి, సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వెళ్లరాదని కోరారు.ఈ సమావేశంలో  డిఎస్పీ  లు ఎన్ లింగయ్య, మహేష్, సిఐ లు శివ శంకర్, రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, సైదులు ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్,రాము, రమేష్, విజయ్, రాజా శేఖర్, సునిత, పియస్ఐ లు తది తరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే
    ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్  విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు  నమస్తే భారత్ షాద్ నగర్ జులై28:ఎస్ఎఫ్ఐ షాద్
గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.
కాక సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు......
సిద్దిపేట పట్టణంలో ఉన్న  సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు నిర్వహించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీనాధ్
నూతన కార్డులు పేదలకు వరం.
ప్రతిష్టాత్మక ప.థకాల అమలులో వేగం పెంచాలి
మా కాలనీ లో కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయండి..