అభివృద్ధికి ఆమడ దూరంలో ఆదివాసీలు..
సిపిఎం మండల కార్యదర్శి : సత్రపల్లి
రేగులగండి గ్రామాన్ని సందర్శించిన సిపిఎం బృందం..
మణుగూరు జూలై 28:
మణుగూరు మండల పరిధిలోని రేగులగండి గ్రామ ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నారని,ఆదివాసీల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం సిపిఎం బృందం రేగులగండి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ.. స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆయన అన్నారు.రేగులగండి గ్రామం ఏర్పడి 45 సంవత్సరాలు కావస్తున్న నేటికీ ఆదివాసీల గ్రామాల సమస్యలను పరిష్కరించడంలో పాలక యంత్రాంగం వైఫల్యం చెందారని ఆరోపించారు.కూనవరం గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో ఉన్న రేగుల గండి గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేక ఆదివాసీలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివాసీలకు అనారోగ్య సమస్యలు వస్తే మంచమే 108 అంబులెన్స్ గా భావించి అక్కడి ఆదివాసీలు కూనవరం వరకు రోగులను మంచంపై మోసుకొచ్చే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామంలో అంతర్గత రహదారులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు.గతంలో ఐటిడిఏ ద్వారా సోలార్ ఏర్పాటు చేశారని సోలార్ కూడా మూడు సంవత్సరాల నుండి మరమ్మత్తులకు గురికావడంతో ఆదివాసీలు అంధకారంతో కున్నారిళ్లుతున్నారని,రాత్రి సమయంలో పిల్లాపాపలతో భయాందోళనకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు పాఠశాల చుట్టూ మడుగులుగా ఏర్పడి నీరు నిలవడంతో అందులో దోమలు వృద్ధిచెంది పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అట్టి దోమలు కుట్టడంతో విష జ్వరాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు.అదే పాఠశాలలో చదువుకుంటున్న బాలుడు విష జ్వరంతో మృతి చెందినటువంటి సంఘటన కూడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పై సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు.పరిష్కరించని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నైనారపు నాగేశ్వరరావు,గుండి భీమయ్య,కారం భీమయ్య, గంగరాజు,దేవయ్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

