స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి,ఎమ్ఎస్పి చట్టం చేయాలి.

స్వామినాథన్ సిఫారసులను అమలు చేసి,ఎమ్ఎస్పి చట్టం చేయాలి.

 

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

ఈరోజు జరిగిన రైతు సంఘం మండల జనరల్ బాడీ సమావేశానికి ఆహ్వానితులుగా వచ్చిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ  డివిజన్ కార్యదర్శి సలీం సార్ , మాట్లాడుతూ దేశంలో ప్రధానంగా 55% రైతంగం వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. రైతు వ్యవసాయాన్ని నమ్ముకొని తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి రైతు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పాలకవర్గాలు రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్నప్పటికీ రైతుని ఆదుకునే పరిస్థితి లేదు.వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతు బతికే పరిస్థితి లేదు . కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు భూమి ని కట్టబెట్టి  అలాగే కార్పొరేట్ వ్యవసాయం పేరుతో రైతులను కూలిగా మారుస్తున్నది.గిట్టుబాటు లేక పంట కు పెట్టిన పెట్టుబడి రాదు.ప్రభుత్వాలు అంచనా ప్రకారం ఒక్క ఎకరా వరి కిఅయ్యే ఖర్చు 30000  పైన అవుతుంది. గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోతున్నాడు.రోజు రోజుకు రైతు భూమిని వదిలేసే దిశగా నేటి ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్నారు .పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి రుణాలను మాపి చేసింది. దేశంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చెయ్యనేలేదు. అందుకనే రైతు పక్షాన నిలబడి, రైతంగ సమస్యలకై నిరంతరం పోరాడాలని మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ ,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెన్నప్ప , హాజరయ్యారు. ఈ నూతన కమిటీకి అధ్యక్షులు చంద్రాములు, ఉపాధ్యక్షులు, బాబు, ఎల్ గోవిందు 
ప్రధాన కార్యదర్శి అంజప్ప, సహకార దర్శి  నాగప్ప, చిన్న రాజు 
కోశాధికారి  బాలు మొత్తం 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనరల్ బాడీ సమావేశానికి పి వై ఎల్ జిల్లా కార్యదర్శి సిద్ధ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మల్లేష్, పొర్ల నరసింహ మండలంలోనీ వివిధ గ్రామాల నుండి రైతు సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే
    ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్  విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు  నమస్తే భారత్ షాద్ నగర్ జులై28:ఎస్ఎఫ్ఐ షాద్
గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.
కాక సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు......
సిద్దిపేట పట్టణంలో ఉన్న  సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు నిర్వహించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీనాధ్
నూతన కార్డులు పేదలకు వరం.
ప్రతిష్టాత్మక ప.థకాల అమలులో వేగం పెంచాలి
మా కాలనీ లో కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయండి..