బాలలను పనులో చేర్చుకోకూడదు.అదనపు కలెక్టర్
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
జూలై 1 నుండి జూలై 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రెస్క్యూ టీమ్ అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆపరేషన్ ముస్కాన్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు వయస్సు గల బాల కార్మికులు పని చేసే ప్రాంతాల్లో వారిని గుర్తించి తీసుకున్న పునరావాస చర్యలపై అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లాలోని 38 కేసులు నమోదు కాదా వాటిలో 12 మేజర్, 3 ఎఫ్ఐఆర్ అయినవని, ఐదు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆరు మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించినట్లు తెలిపారు. కోస్గి, మక్తల్ మండలాలలో దాడులు చేసిన వారు తెలిపారు. అధికారులు ఎఫ్ఐఆర్ పెంచి టార్గెట్ పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా జిల్లాలోని హోటళ్ళు, పూల దుకాణాలు, మెకానిక్ షాపులు, నిర్మాణ రంగం, భిక్షాటన, ఇటుక బట్టీలు, ఇతర చోట్ల, ప్రమాదకర ప్రాంతాలలో పని చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో కలిసి రెస్క్యూ టీమ్ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ తనిఖీలలో బాల కార్మికులను గుర్తిస్తే వారిని పనిలో నియమించిన వారి పై బాల కార్మిక నిర్మూలన చట్టం 2016 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, బాల కార్మికుల పిల్లలను బాలల సంరక్షణ కమిటీ కి అప్పగించి వారి సంక్షేమం కు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలలు పాఠశాల, కళాశాల లో ఉండాలని, పనిలో ఉండవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 0 నుండి 14 సంవత్సరాల లోపు, 14 నుండి 18 సంవత్సరాల లోపు బాలలను పని లో పెట్టుకున్నా, వారిని లైంగికంగా వేధించిన అటు వంటి సంఘటనలు బాలల సంరక్షణ అధికారి కి గాని చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 కి సమాచారం అందించాలని అన్నారు. జులై 1 నుండి జులై 31 వరకు వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ లో తప్పి పోయిన, నిరాదరణ కు గురైన, పని లో ఉన్న బాల కార్మికులను గుర్తించాలని అన్నారు. గుర్తించిన బాల కార్మికుల సంరక్షణ, వారికి విద్య అందించాలని, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు.ఈ సమావేశం లో డిఎస్పి లింగయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

