పెన్షన్ పెంచకుంటే ఉద్యమం మళ్లీ భగ్గుమంటుంది: ఎన్పీఆర్డి

పెన్షన్ పెంచకుంటే ఉద్యమం మళ్లీ భగ్గుమంటుంది: ఎన్పీఆర్డి

 

సెర్ప్ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా సీఈఓ హామీతో తాత్కాలిక విరమణ

నమస్తే భారత్ షాద్‌నగర్, జూలై 23
వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000 వరకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డి) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం భారీగా ధర్నా నిర్వహించారు. జోరు వర్షాన్ని లెక్కచేయకుండా,  సెర్ప్ కార్యాలయం ఎదుట వికలాంగులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆందోళన చేశారు.
అనంతరం సెర్ప్ సీఈఓ దివ్యతో సంఘం ప్రతినిధులు చర్చలు జరిపారు. పలు హామీలు అనంతరం ధర్నా తాత్కాలికంగా విరమించారు.
పెదవారికి అందాల పోటీలు.. వికలాంగులకు పెన్షన్ పెంపు లేదు
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ, “పెదవారికి ప్రభుత్వానికే అందాల పోటీలు నిర్వహించేందుకు నిధులుంటే, వికలాంగుల కోసం పెన్షన్ పెంపు చేయడానికి లేవా?” అంటూ ప్రశ్నించారు.పెన్షన్‌ను రూ.4,016 నుంచి రూ.6,000కు పెంచి, 2024 జనవరి నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల చేయూత పథకాలను మంజూరు చేయాలని కోరారు. తీవ్రమైన వైకల్యం ఉన్న వికలాంగులకు రూ.20,000 ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం స్పందించకపోతే మరింత తీవ్ర ఉద్యమం 2025 జూలై 5 నుండి 23 వరకు తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాల్లో వినతిపత్రాలు, జూలై 17న 25 జిల్లాల్లో కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేసినా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపైఎం.అడివయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.వాగ్దానాలతో మోసం చేయడం మానాలి”అని తీవ్రంగా విమర్శించారు.వైద్య ఖర్చులు పెరిగినా ఆదుకోవడంలేదు
రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ మాట్లాడుతూ,తీవ్రమైన వైకల్యం కలిగిన 15 వేలమంది మంచానికే పరిమితమయ్యారు. వారి సంరక్షణ భారంగా మారింది. ఇప్పటికైనా ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయాలి” అని అన్నారు.నైబర్‌హుడ్ సిబ్బందిపై అన్యాయం నైబర్‌హుడ్ కేంద్రాల్లో పనిచేస్తున్న వికలాంగులకు తక్కువ వేతనం చెల్లించడమే కాకుండా, దానిని సాకుగా చూపి పెన్షన్లు రద్దు చేయడం అన్యాయమన్నారు. వీరికి మళ్లీ పెన్షన్ ప్రారంభించాలని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో సీసీలుగా వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.సీఈఓ దివ్య హామీధర్నా అనంతరం సెర్ప్ సీఈఓ దివ్య మాట్లాడుతూ, పెన్షన్ పెంపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు నెలల్లో పెండింగ్ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. తీవ్రమైన వైకల్యం ఉన్న వారికి ప్రత్యేక అలవెన్స్, అలాగే ఇందిరా శక్తి క్యాంటీన్లలో వికలాంగులకు వాటా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
 పాల్గొన్నవారు:రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, కాషాప్ప, స్వామి, ఉపేందర్, నాగలక్ష్మి, మధుబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమోహన్, ప్రకాష్, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మల్లేష్, నర్సింలు, పిచందు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భుజంగారెడ్డి, షాహిన్ బేగం, శేఖర్ గౌడ్, బాలయ్య, సుల్తాన్ రమేష్, లలిత, బాలకృష్ణ, మేరీ, మంగమ్మ, లావణ్య, గణేష్, శివ, పార్వతి, లక్ష్మిపతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే విద్యార్థుల చావులన్ని ప్రభుత్వ హత్యలే
    ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్  విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు  నమస్తే భారత్ షాద్ నగర్ జులై28:ఎస్ఎఫ్ఐ షాద్
గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు.
కాక సారయ్య పెట్రోల్ బంక్ శ్రీ సమ్మక్క- సారలమ్మ కోమలి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారు......
సిద్దిపేట పట్టణంలో ఉన్న  సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్ లో తనిఖీలు నిర్వహించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, అర్బన్ వ్యవసాయ అధికారి శ్రీనాధ్
నూతన కార్డులు పేదలకు వరం.
ప్రతిష్టాత్మక ప.థకాల అమలులో వేగం పెంచాలి
మా కాలనీ లో కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేయండి..