ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐ పి యస్

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐ పి యస్

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

జిల్లాలోని ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉంచరాదని, ప్రజలకు తక్షణమే న్యాయం అందించి పోలీస్ వ్యవస్థ పై నమ్మకం భరోసా కలిగేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు తెలిపారు.ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా సోమవారం ఉదయం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 08 మంది ఫిర్యాదులను జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్ ఐపీఎస్ పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి వెంటనే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫైర్ నమోదు చేయాలని తదుపరి కేసు విచారించి పరిష్కరించాలని తెలిపారు. భూ తగదాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తప్పకుండా రసీదు, FIR కాఫీ ఇవ్వాలని పోలీసు అధికారులకు తెలిపారు. జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా విధులు నిర్వర్తించి వారికి సరైన న్యాయం అందించి భరోసా భద్రత కల్పించాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ  తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. పైల‌ట్‌, కో పైల‌ట్ ఎవ‌రంటే..? అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదం.. పైల‌ట్‌, కో పైల‌ట్ ఎవ‌రంటే..?
అహ్మ‌దాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండ‌ర్ బ‌య‌ల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే.. కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల్లోనే పైల‌ట్‌లు ఇద్ద‌రు...
హాస్పిటల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..
169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్‌ దేశస్థులు.. కూలిన విమానంలో ఇంకా ఎవరున్నారంటే..?
కిరాణం తీసుకునే లోపే స్కూటీ మాయం
కాంగ్రేస్ ప్రభుత్వం చంద్రుడి మీద మచ్చ చూపించే ప్రయత్నం.....
డిప్యూటీ స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి 
జులై 9న కార్మిక సమ్మెను జయప్రదం చేయండి