ఇందిరమ్మ ఇండ్ల లొల్లి

ఇందిరమ్మ ఇండ్ల లొల్లి


ములుగు జిల్లా వ్యాప్తంగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు విడుదల చేసిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో 95% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండటం పేదవారికి చోటు లేకపోవడం చాలా బాధాకరం అని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్యాల మనోహర్ ఆరోపించారు గత ప్రభుత్వం వాల్ల పార్టీ కార్యకర్తలకే డబుల్ బెడ్ రూమ్ఇల్లు ఇవ్వగా, ఈ ప్రభుత్వం వాళ్ల కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఉన్న వారి పేర్లు రావడం రెండు పార్టీలు చేసింది ఒకటే అని అర్థమవుతుంది కొంతమంది దగ్గర 50,000 వసూలు చేసి ఇల్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ పేదలను పట్టించుకునే ప్రభుత్వాలు ఇప్పటివరకు రాలేదు ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు పేదల వైపు చూడవు పేదలను పట్టించుకోవు ఈ తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో భాగమై మనమే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అధికారంలో రాజ్యంలో మనం ఉన్నప్పుడే మన బాధలు తీరి  మన పిల్లల భవిష్యత్తు మారే అవకాశం ఉందఅన్నారు. ఈ రకంగా చూస్తుంటే పేదవారికి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుంది మరికొన్నిచోట్ల ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో ఉన్న వారి పేర్లు మరియు రేషన్ కార్డు లేని వారికి కూడా ఇల్లు మంజూరవడం అసలు ఎలా ఎంపిక చేశారు అధికారులకే తెలియాలి ఎలా సర్వే చేశారు పెసా గ్రామ సభలు ఎన్ని నిర్వహించారు ఇండ్లున్నోలకే ఇల్లులు వచ్చాయా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళకి వచ్చాయా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మార్వో కలెక్టర్ ఎమ్మెల్యేలకు ఉన్నది 
ఓట్ల కోసం మాత్రమే పేదల గడప తొక్కే రాజకీయ నాయకులకు ఈరోజు ఇల్లు లేని పేదలు శిథిలావస్థలో ఉన్న ఇల్లులు కిరాయి ఇండ్లలో నివసిస్తున్న వారు పూరి గుడిసెలు పరదాలు కట్టుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఎందుకు కనిపించట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాల్ల కార్యకర్తలకు మాత్రమే ఇల్లు ఇస్తుంది . పేదవారిని గుర్తించట్లేదు ఒంటెద్దుపోకడ పోతుంది
అసలు ఈ  రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉందా లేదా లేక ఈ రెండు పార్టీలు ఒకటేనా అనే సంశయంలో  పేద ప్రజలు పడ్డారు 
టిఆర్ఎస్ పార్టీ లీడర్ పేరు ఒక మండలానికి పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లు వచ్చిన కొంతమంది ప్రజల దగ్గర 50,000 తీసుకొని ఇల్లు ఇచ్చిన, అడిగే లీడర్ లేకపోవడం ఈ రెండు పార్టీలు ఒకటే అన్న అనుమానం ప్రజల్లో బలంగా పాతుకు పోతుంది గత పదివేలు మీ రాజ్యం ఈ పదేళ్లు మా రాజ్యం దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పేదల ముఖం చూసే నాయకుడే లేడు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రీ సర్వే నిర్వహించి అర్హులైన పేదవారిని శిథిలావస్థలో ఉన్న ఇల్లు, ఇల్లు లేకుండా కిరాయిల్లలో నివస్తున్న పేదవారిని గుర్తించి ఇల్లు ఇవ్వకుంటే మళ్ళీ టిఆర్ఎస్ కు పట్టిన గతే మీకు పడుతుందని ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మల్యాల మనోహర్ ఆరోపించారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పంచాయతీల బిల్లులు వెంటనే విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
కారేపల్లి, జూన్ 24 : గ్రామ పంచాయ‌తీల పెండింగ్‌ బిల్లులు ప్ర‌భుత్వం వెంట‌నే చెల్లించాల‌ని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హ‌రిప్రియ‌ నాయ‌క్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం...
మేడ్‌ఇన్‌ ఇండియా ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం : ప్రధాని మోదీ
యువ‌త దుష్ప్రభావాల భారిన ప‌డ‌కుండా ఉండాలి : ఎస్ఐ ప్ర‌సా
ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హవా..
మెగాస్టార్ చిరంజీవి త‌ల్లికి మరోసారి అస్వస్థత?
24 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులు.. పాఠశాల ఉపాధ్యాయుడు అరెస్ట్‌
చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు మంత్రి స‌వాల్