వర్షాకాలం కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి:
- రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.
తేదీ. జూలై 21, 2025–
నమస్తే భరత్
నిర్మల్: పట్టణంలోనే కలెక్టర్ కార్యాలయంలో
సోమవారం సాయంత్రం హైదరాబాదు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్షాకాలం కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, వరదల నష్ట నివారణ చర్యలు, వ్యవసాయం, సాగునీరు, నూతన రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా సీఎం మాట్లాడుతూ, వర్షాకాలం కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, తదితర వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున దోమల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్యులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అధిక వర్షాల వల్ల సంభవించే వరదల నష్టాలు నివారించేందుకు అధికారులు తగు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకూడదన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు అన్ని జిల్లాలలో కలెక్టర్లు, జిల్లల ఇన్చార్జి మంత్రులు, శాసనసభ్యులు ప్రజలకు రేషన్ కార్డులను అందించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అన్నారు. రైతులకు అవసరమైన యూరియా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కృత్రిమ యూరియా, ఇతర ఎరువుల కొరత సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో ఆకస్మిక పర్యటనలు చేస్తూ ఉండాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, వర్షాకాలం కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం దోమలు, దోమల లార్వాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మెరుగైన పారిశుద్ధ్య పనులు నిర్వహించడం ద్వారా వ్యాధులను నియంత్రించవచ్చునని తెలిపారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులతో పాటు, అవసరమైన మందులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి జిల్లాలో మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను చేపట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారుల సమన్వయంతో రైతులకు పంటలకు అవసరమయ్యే సాగునీరును అందించాలని పేర్కొన్నారు. రైతులందరికీ సరిపడినంత యూరియా, డిఏపి, ఇతర ఎరువులను అందించాలని తెలిపారు. అన్ని ఎరువులు, మందుల దుకాణాలలో అందుబాటులో ఉన్న ఎరువులకు సంబంధించి వివరాలను ప్రదర్శించాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. అధిక వర్షాల వల్ల అకాల వర్షాలు సంభవిస్తే వరద నష్టాలను నివారించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలు (ఎన్డీఆర్ఎఫ్) అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిపిఓ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, డిఎంహెచ్ఓ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, నీటిపారుదల శాఖ అధికారులు రవీందర్, అనిల్, గణేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

