ముగిసిన షాద్ నగర్ లెవెల్ 2 చదరంగం క్రీడల పోటీలు 

ముగిసిన షాద్ నగర్ లెవెల్ 2 చదరంగం క్రీడల పోటీలు 

 

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై... అవార్డుల అందజేతతో ముగిసిన చదరంగా క్రీడల పోటీలు

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చదరంగ పోటీలలో భారీ సంఖ్యలో పాల్గొన్న బాల బాలికలు

గెలిచిన బాల బాలికలకు మెమెంటోలు అవార్డు ప్రదానం 

పోటీలో పాల్గొన్న బాలబాలికలకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నిర్వాహకుడు వానరాశి జగన్  

పోటీలలో పాల్గొన్న బాలబాలికలకు మధ్యాహ్న భోజనం అందించిన ఎలికట్ల గ్రామ కంటెస్టెడ్ ఎంపీటీసీ జి అభినవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన వానరాశి జగన్

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 04:చదరంగం క్రీడ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేసే, అత్యద్భుతమైన మేధా సంపత్తిని కలిగిన ఆట అని, బాల బాలికలందరూ పెద్ద ఎత్తున హాజరు కావడం సంతోషంగా ఉందని, విద్యా వైద్యం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, విద్యార్థిని విద్యార్థులను బాల బాలికలను యువతీ యువకులను విద్య మరియు క్రీడల వైపు తమ మనసును మళ్లించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రతిసారి కోరుకునే ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొద్దిసేపు చదరంగం క్రీడను ఆడి  బాల బాలికలను ఉత్సాహపరిచారు. షాద్ నగర్ లెవెల్ 2 చదరంగం క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శంకర్ ను చదరంగం క్రీడా పోటీల నిర్వాహకుడు వానరాశి జగన్ సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  గెలిచిన బాల బాలికలకు అవార్డుల ను ప్రధానం చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చదరంగం క్రీడల పోటీలు ఏసీపీ హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వలన ఆయన రాలేకపోయినందుకు 24 వ వార్డు కాంగ్రెస్ యువ నాయకుడు ఇంజమూరి గోపాల్, వైయస్సార్సీపి యువ నాయకుడు శీలం శ్రీనులు సంయుక్తంగా, క్రీడల పోటీలకు విచ్చేసిన బాల బాలికల తల్లిదండ్రులతో సహా  జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గావించి  చదరంగం క్రీడల పోటీలను ప్రారంభించారు. 7, 9, 11, 13,15, 17 వయస్సు లోపల బాలబాలికలందరూ చదరంగం క్రీడా పోటీలలో సాయంత్రం నాలుగు గంటల వరకు పాల్గొని తమ అత్యద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించి అవార్డులు, ప్రశంస పత్రాలు, మెడల్స్ దక్కించుకున్నారు. చదరంగం క్రీడల పోటీల కార్యక్రమానికి ఎలికట్ట గ్రామ యువ నాయకుడు, కంటెస్టడ్ ఎంపిటిసి జి.అభినవ్ మానవతా దృక్పథంతో, క్రీడలపై మక్కువతో క్రీడాకారులందరికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించారు.  చదరంగం క్రీడల పోటీలలో అండర్ 07 విభాగంలో మొదటి బహుమతి  లవిక్ రామ్, ద్వితీయ   బహుమతి ఏ. విశ్వ, తృతీయ బహుమతి కె. సుమిత్ కుమార్ లు బహుమతులు సాధించగా, అండర్ 09 విభాగంలో మొదటి బహుమతి   కార్తికేయ, ద్వితీయ బహుమతి సాయి కుపాకర్ , తృతీయ బహుమతి ఈశ్విత లు బహుమతులు సాధించగా, అండర్ 11 విభాగంలో మొదటి బహుమతి  లాస్య శ్రీ, ద్వితీయ బహుమతి యుజిత్ , తృతీయ బహుమతి ఆర్యామన్ లు బహుమతులు సాధించగా, అండర్ 13 విభాగంలో మొదటి బహుమతి  భావిక్, ద్వితీయ బహుమతి శ్రీ హర్షిత్ , తృతీయ బహుమతి భాను తేజ లు బహుమతులు సాధించగా, అండర్ 15 విభాగంలో మొదటి బహుమతి  హవీష్ రెడ్డి, ద్వితీయ బహుమతి రమేశ్వరి , తృతీయ బహుమతి అర్షిత్ లు బహుమతులు సాధించగా, అండర్ 17 విభాగంలో మొదటి బహుమతి శ్రీ వర్ధన్ గౌడ్, ద్వితీయ బహుమతి శ్రీ చందన , తృతీయ బహుమతి సిరి వల్లి లు బహుమతులు సాధించగా వారందరికీ చదరంగా పోటీల క్రీడా నిర్వాహకుడు  షాద్ నగర్ చెస్ అకాడమీ కోచ్ వానరాశి జగన్ షీల్డ్ లు, మెడల్స్ తో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు. అలాగే ఈ చదరంగా క్రీడ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో పాటు, కేశంపేట్ జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి, కొందుర్గు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అగునూరి విశ్వం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ నాయక్, అధిక సంఖ్యలో బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News