ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ ప్రారంభించిన 

ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ ప్రారంభించిన 

 

 డాక్టర్ వి విజయలక్ష్మి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ 

నమస్తే భారత్ షాద్ నగర్ జులై11:ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డాక్టర్ వి విజయలక్ష్మి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో హెల్త్ ఎడ్యుకేటర్ జె .శ్రీనివాసులు హెల్త్ స్లొగన్స్ చెప్పుకుంటూ షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి షాద్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ వి విజయలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు మనము ఒక ముఖ్యమైన గ్లోబల్ అవసరాన్ని గుర్తిస్తాము అదే " వరల్డ్ పాపులేషన్ డే" ప్రతి ఏడాది జూలై 11న జరుపబడే ఈరోజు మనకు ప్రపంచ జనాభా పెరుగుదల దాని ప్రభావాలు,  మన బాధ్యతలపై అవగాహన కల్పిస్తుంది. 
 ప్రపంచ జనాభా దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం 
ప్రపంచ జనాభా పెరుగుదల,  దాని ప్రభావాలు,  మరియు వాటిపై అవగాహన కల్పించేందుకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఈ సంవత్సరము ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క థీమ్ "ప్రణాళిక బద్ధమైన మాతృత్వం గర్భాదారుల మధ్య ఆరోగ్యకరమైన సమయం మరియు అంతరం"ఇది ముఖ్యంగా.. జనసంఖ్య నియంత్రణ  అవసరం,  కుటుంబ సంక్షేమం,  లింగ సమానత్వం మరియు వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది అని,  ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ మొట్టమొదట 1989లో మొదలైంది . అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటారని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మన సమాజంలో యువతకు వారి జీవితాలు , వారి కుటుంబ ఆకాంక్షలను,  సాఫీగా సాధించేందుకు,  అవకాశాలు కల్పించడం,  ఒక సమానత్వము , ఒక ఆశాపూరిత ప్రపంచంలాంటి సృష్టికి మార్గం చూపడమే ప్రధాన సంకల్పం  అని డాక్టర్ విజయలక్ష్మి చెప్పారు. యువతకు సరైన విద్య,  ఉద్యోగ , ఆరోగ్య సంరక్షణ, యువత వారు అనుకున్న కుటుంబాన్ని నిర్ణయం చేసుకునే హక్కులు కల్పించాలి అని, ఆరోగ్యం కోసం ఒక దృఢమైన వాతావరణాన్ని నిర్మిద్దాం అని, ఒక సారూప్యమైన ప్రపంచం, అందుబాటులో ఉండాలి అని, సామాన్యులకు ప్రత్యేక సేవలు అందించాలి అని,  సమానత్వ అధ్యాయాలు పెంచాలని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ మండల్ వైద్యాధికారులు డాక్టర్ స్రవంతి,  డాక్టర్ రాఘవేందర్, ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారులు డాక్టర్ సత్యనారాయణ ,డాక్టర్ కార్తీక్, డాక్టర్ జగదీష్ , డాక్టర్ సంధ్య , డాక్టర్ ప్రవీణ, డాక్టర్ బిందు, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, బూర్గుల పి హెచ్ ఎన్ మహేశ్వరి, హెల్త్ సూపర్వైజర్లు అమృత, శ్రీరామ,  చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్ రెడ్యానాయక్, ఆఫీస్ సిబ్బంది  రవికుమార్,  గౌస్,  లింగం మరియు ఏఎన్ఎంలు మరియు ఆశాలు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు
    చదువు ఒక్కటే మనిషి దశా దిశను మారుస్తుంది సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి   రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ " నంగునూరు జిల్లా పరిషత్ హై
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు కల్పించటం చరిత్రాత్మక నిర్ణయం ప్రభుత్వ సలహాదారు కే. కేశవ రావు
ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ ప్రారంభించిన 
నానో యూరియా డిఏపిలతో అధిక లాభాలు:వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్
మున్సిపల్ సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన 
స్థానిక ఎలక్షన్ 42% కాదు?జనరల్ సీట్లు మొత్తం ఇచ్చిన ఉపయోగం లేదు..
నిందితునికి జైలు శిక్ష