పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!

పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!

 

వికలాంగుల జీవితాలతో చెలగాటమా? వారి ఉసురు ఊరికే పోదు! 

కాంగ్రెస్ ప్రభుత్వంలో పెంచే పెన్షన్ ఊసే లేదు, కొత్త పెన్షన్లకు దిక్కే లేదు!

మూడు నెలల పెన్షన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఒకటో తారీకు 4 వేల పెన్షన్ ఇస్తుంది 

బిజెపి డబుల్ ఇంజన్ సర్కారే తెలంగాణకు శ్రీరామరక్ష 

- బిజెపి కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి

నమస్తే భారత్ షాద్ నగర్ జులై29: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ఇందిరమ్మ ప్రజాపాలనలో ప్రజల బాధలు అన్నీ ఇన్ని కావని బిజెపి కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి అన్నారు. ఈరోజు శ్రీరంగాపూర్ గ్రామంలో వృద్ధులు, వితంతువులతో కలిసి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లను చేయూతగా మార్చి వృద్ధులు, వితంతువులకు 2000 రూపాయలుగా ఉన్న పెన్షన్ ₹4000 చేస్తామని, వికలాంగులకు ఇస్తున్న 4000 రూపాయలు 6000 రూపాయలు చేస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు కావస్తున్న పెన్షన్ దారులకు ఇచ్చిన హామీని అటకెక్కించిందని అన్నారు. అది పోగా నెల నెల ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు మూడు నెలలుగా ఇవ్వకుండా పెన్షన్ డబ్బులపై ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. అర్హులకు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా, ఉన్న పెన్షన్ దారులకు డబ్బులు సకాలంలో ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెన్షన్ దారుల ఉసురు ఊరికే పోదని అన్నారు. పెన్షన్ దారులు అనుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిపోక తప్పదని అన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి అసరా పెన్షన్ దారుల తడాఖా చూపించాలని సూచించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తారీకు నాడు పెన్షన్ దారుడి ఇంటికే వెళ్లి వృద్ధులు,  వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 ఇవ్వడం బిజెపి భాగస్వామ్య ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. తెలంగాణలో బిజెపి డబుల్ ఇంజన్ సర్కారు వస్తే తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం దొరకదని, డబుల్ ఇంజన్ సర్కారే తెలంగాణకు శ్రీరామరక్ష అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి స్థానిక చట్టసభలకు పంపాలని పెన్షన్ దారులను అభ్యర్థించారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు నారాయణపేట జిల్లాలోని బైరంకొండ గ్రామంలోవెంటనే ఉపాధ్యాయులునీ నిర్మించాలని అన్నారు
,,,,నమస్తే భరత్,,,29/7/2025/,నారాయణపేట జిల్లా,,,మండలం లోని బైరంకొండ గ్రామంలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు మాజీ సర్పంచులు సాయిబన్న, రామకృష్ణ శివప్ప గ్రామ యువకులు...
మూల మర్రి తండాలో ఉచిత వైద్య శిబిరం.
పెన్షన్ దారులను ఇబ్బంది పెడితే పుట్టగతులుండవ్..!
ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి:
నూతన రేషన్ కార్డులతో పేదలకు కడుపునిండా అన్నం:
కోస్గి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
చేతి వృత్తులకు భవిష్యత్తులో విలువ పెరుగుతుంది – జిల్లా కలెక్టర్