ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలి:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలి:


శిథిల భవనాల కూల్చివేతకు తక్షణ చర్యలు:
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

తేదీ, జూన్ 13, 2025-
నమస్తే భరత్ 

నిర్మల్ జిల్లాలో
      ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేలా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.       
           శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, బడిబాట, శిథిల పాఠశాల భవనాల గుర్తింపు, వనమహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టే ముందస్తు చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
      ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేలా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గత విద్యాసంవత్సరం అంగన్వాడి విద్య పూర్తి చేసిన పిల్లలందరినీ సమీప ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అంగన్వాడి కార్యకర్తలు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో విద్యార్థుల ప్రవేశ శాతం పెంపుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. శిధిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాల గుర్తింపు, బడి బాట కార్యక్రమం అమలుపై మండలాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల వారిగా డ్రాప్ అవుట్ విద్యార్థుల సమాచారం సేకరించి, ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులతో చర్చించి, పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.
      జిల్లాలో ఇప్పటివరకు 163 పాఠశాలల్లో 302 తరగతుల గదులు శిథిలావస్థకు చేరినట్లు గుర్తించామని, అత్యంత ప్రమాదకరంగా ఉన్న భవనాల కూల్చివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం మండలాల వారీగా శిథిల భవనాల వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు.
        జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రారంభ దశ నుంచే ప్రజలకు మొక్కలు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ప్రాంగణాలలోని ఖాళీ ప్రదేశాలు, చెరువుల గట్లు, ప్రాజెక్టులు, చెరువుల కాలువలు, రోడ్లకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
       పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని, రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది నిరంతరం గ్రామాలను సందర్శిస్తూ వ్యాధుల నియంత్రణకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 
      ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ రామారావు, జెడ్పీ సీఈఓ గోవింద్, డిపిఓ శ్రీనివాస్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, డిఎం అండ్ ఎచ్ఓ రాజేందర్, ఎంపీడీవోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాదురు శ్రీనివాస్‌రెడ్డి సేవలు ఎనలేనివి : ఎంపీ చామల పాదురు శ్రీనివాస్‌రెడ్డి సేవలు ఎనలేనివి : ఎంపీ చామల
నీలగిరి, జూన్ 14 : రిటైర్డ్ విద్యాధికారి, దివంగ‌త‌ పాదూరి శ్రీనివాస్ రెడ్డి సేవలు ఎనలేనివని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం...
వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రతీ రైతు సద్వినియోగం చేసుకోవాలి : తహసీల్దార్ బుచ్చయ్య
అంతర్జాతీయ ఒలింపిక్ డే ను విజయవంతం చేయాలి : యుగంధ‌ర్‌రె
విదేశీ ఉపకార వేతనాలను మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలి’
పట్టా భూమిలో దౌర్జన్యంగా రోడ్డు.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి : దళిత ప్రజాసంఘాల నాయకులు
స్పోర్ట్స్ స్కూల్‌లో దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలివే
ప్రతి గిరిజ‌న‌ పల్లెకు వైద్య సేవలు అందాలి : హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్