విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలి: షి టీమ్ పోలీసులు
నారాయణపేట జిల్లా / నమస్తే భారత్
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం రోజు మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, డ్రగ్స్, గంజాయి, ట్రాఫిక్ చట్టాలు, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనర్ధాలు, పోటీ పరీక్షల గురించి, లీడర్షిప్ లక్షణాలు, డయల్100 తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షి టీమ్ పోలీసులు చేనప్ప, జ్యోతి, కవిత లు మాట్లాడుతూ.విద్యార్థులు పాఠశాలకు వచ్చి పోయే సమయంలో ఎవరైనా అమ్మాయిలను వేధిస్తే షి టీమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అలాగే తమకు తెలిసిన వాళ్ళు గా, సొంతంగా ఉండి అమ్మాయిలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారని వారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని వివరించారు.
గుడ్ టచ్ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమగా అలింగణం చేసుకోవడం, గురువులు విద్యార్థుల తల మీద లాలనగా చేతులు పెట్టడం, స్నేహితులు హై-ఫై ఇవ్వడం.
బ్యాడ్ టచ్. ఇది బాలుడికి/ బాలికకు అసహజంగా, భయంగా, అపరాధ భారంగా అనిపించవచ్చు ఇది ప్రమాదకరమైనదిగా భావించాలి. ఎవరైనా ప్రైవేట్ భాగాలను అనవసరంగా తాకడం, ఒత్తిడి చేస్తూ అతుక్కోవడం లేదా ముద్దు పెట్టడం, ఒంటరిగా ఉండమని బలవంత పెట్టడం, హామీలతో లేదా బహుమతులతో ఆకర్షించడం స్పర్శకు ఒప్పించేందుకు ప్రయత్నించడం. సెల్ ఫోన్ లో అశ్లీలంగా, ఫోటోలు వీడియోలు చూపించడం పిల్లలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.విద్యార్థులు గుర్తించుకోవాల్సిన విషయాలు:నా శరీరం నా సొంతం ఎవరు అనవసరంగా తాకకూడదని గుర్తుంచుకోవాలి. ప్రైవేట్ భాగాలు నచ్చని స్పర్శపై ఐ యాం నాట్ కంఫర్టబుల్ అని ధైర్యంగా చెప్పాలి. వెంటనే నమ్మదగిన పెద్దలకు తల్లిదండ్రులకు టీచర్కు పోలీస్ వారికి తెలియజేయాలి. ఒంటరిగా ఉండవద్దు ఎవరైనా గుప్తంగా మాట్లాడమంటే నిరాకరించాలి ఈ విషయాలను విద్యార్థినిలు తప్పకుండా గుర్తించుకోవాలని షి టీమ్ పోలీసులుఒ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
జిల్లా పరిధిలో ఎవరైనా ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ కు పాల్పడితే, వేధిస్తే నారాయణపేటపేట షీ టీం సెల్ నంబర్ 8712670398 కి లేదా డయల్ 100, 112 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు ఆటలు ఆడాలని, ఆటలు ఆడడం వల్ల లీడర్షిప్ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు లీడర్షిప్ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షి టీమ్ పోలీసులు చేనప్ప, జ్యోతి, కవిత, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

