లక్షలాది ఎకరాలకు నీరంధించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారు
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం సరికాదు
టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి
నమస్తే భారత్ , రాజేంద్రనగర్, జులై 06, రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నిరంధించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కాలేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం స్థానిక తెరాస నాయకుల తో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ లో భీడు భూములుగా ఉన్న లక్షలాది ఎకరాలకు నీరు అందించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం సుదీర్ఘమైన ఆలోచన చేసి కనీవినీ ఎరగని రీతిలో రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న రైతుల కోసం కాలేశ్వరం ప్రాజెక్టు కోట్ల రూపాయలతో నిర్మించారు. దశాబ్ద కాలంలో రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాలు పండించి దేశంలోనే అత్యున్నతంగా వరి పండించిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ నిలిపిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకాని హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అడ్డదారిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పదేళ్ల పరిపాలన లో రాష్ట్రంలో అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మెండుగా అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కోట్ల ఆదాయంతో కాలేశ్వరం ప్రాజెక్టులు నిర్మించి రైతుల కోసం రైతు అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి కెసిఆర్ కాదా అని ఆయన అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు అబూత కల్పనలు కల్పించి రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా మారుస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడిని కదిలించినా, ఏ రైతును కదిలించినా ఏ ఉద్యోగిని కదిలించినా కేసీఆర్ చేపట్టిన గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారని అదే ఈ ప్రభుత్వం గమనించాలన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, దళితుల కోసం దళిత సాధికారత పథకం లాంటి ఎన్నో చరిత్రలో నిలిచిపోయేటువంటి పథకాలను చేపట్టిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని దుమారం లేపుతూ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అభాండాలు వేయాలని నిరాధార ఆరోపణలు చేస్తుందని వారు అన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని ఇది ఈ ప్రభుత్వం గుర్తించుకుంటే చాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నాయకులు మంచెర్ల మోహన్రావు, పి ఎస్ సి హెచ్ చైర్మన్ బూర్కుంట సతీష్, మాజీ ఎంపీపీ దుద్యాల జయం మా శ్రీనివాస్, తెరాస సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజేందర్, రమేష్, హనుమంతు ముదిరాజ్, తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

