ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.

 

తేదీ,  ఆగస్టు, 04, 2025–
(నమస్తే భరత్  ప్రతినిధి)

సోమవారం నిర్మల్ పట్టణంలోనే కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.
      ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్, మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. 
     ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో బేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. కాలానుగుణ వ్యాధులు నియంత్రించేందుకు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటికే మూడుసార్లు జ్వర సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
    పెంబి మండలానికి జాతీయస్థాయిలోనే ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో కాంస్య పతకం రావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అధికారుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పెంబి ఆస్పిరేషన్ బ్లాక్ జాతీయస్థాయిలో మంచి స్థానంలో నిలవడం లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కృషి గర్వించదగ్గదని అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా కాంస్య పతకాన్ని స్వీకరించినందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ లను జిల్లా అధికారుల సంఘం తరపున సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
     ప్రజలు పెద్ద ఎత్తున అవయవదానానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖ రిటైర్డ్ ఉద్యోగి జొన్న వినోద్ కుమార్ దంపతులు మరణానంతరం వారి దేహాలను నిర్మల్ వైద్య కళాశాలకు విద్యార్థుల శిక్షణ కొరకు దానం చేయనున్నట్లు తెలిపారు. తన దేహాన్ని మరణానంతరం దానం చేయడం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. దీని ద్వారా వైద్య కళాశాల విద్యార్థులకు శిక్షణ, శాస్త్రీయ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో అవయవ దానానికి ముందుకు రావాలని అన్నారు. అవయవదానంతో ఎంతోమంది జీవితాలలో మరణానంతరం కూడా వెలుగును నింపవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా దేహాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన వినోద్ కుమార్ దంపతులను కలెక్టర్ అభినందించారు. ఇంతకుముందే వారి కుటుంబం నుంచి శరీరాలను పలు వైద్య కళాశాలలకు దానం చేసినందుకు వారిని ప్రశంసించారు. ఆయనను అదనపు కలెక్టర్ల తో కలిసి  పింఛనర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ సన్మానించారు.
         ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా  అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

డంప్ యార్డును తలపిస్తున్న  హెచ్ఏఅల్ కాలనీ వీధులు డంప్ యార్డును తలపిస్తున్న  హెచ్ఏఅల్ కాలనీ వీధులు
కుప్పలు తెప్పలుగా చెత్తాచెదారం దుర్వాసనతో సతమతమవుతున్న ప్రజలు పట్టించుకోని జీహెచ్ఎంసి పారిశుధ్య యంత్రాంగం గాజులరామరం మున్సిపల్ సర్కిల్ 26 పరిధిలోని 125 డివిజన్ హెచ్ఏఎల్ కాలనీ సత్యనారాయణ...
వల్లంపల్లి మధు కూతురుని,అశీర్వదించి న,ముదిరాజ్ పెద్ద విజయ్ కుమార్,,,నమస్తే భరత్,,,6=8=2025=
ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : సూర్యనారాయణరాజు
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివి 
కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి బీసీల డిమాండ్స్ ఆమోదించాలి
ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: మద్దూర్ ఎస్ఐ విజయ్ కుమార్.
నడిరోడ్డులో హత్య.. నింధితులను పట్టుకున్న పోలీసులు