తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివి
ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి
పిఎసిఎస్ చైర్మన్ భూర్కుంట సతీష్
నమస్తే భరత్, రాజేంద్రనగర్, ఆగస్టు 6. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని మల్కారం పిఎసి ఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ భూర్కుంట సతీష్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శంషాబాద్ మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మంచర్ల మోహన్ రావు ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ కాలనీ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, ఆయన సేవలు భావితరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ ఆర్ బి నగర్ కౌన్సిలర్ కొనమల్ల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, హనుమంతు, ముదిరాజ్ పరంధాములు, చిన్నగండు రాజేందర్, చరణ్,మహేష్ యాదవ్, శేఖర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

