ఊరికి ఉపకారం చేయాలనే ఆలోచన అభినందనీయం.

ఊరికి ఉపకారం చేయాలనే ఆలోచన అభినందనీయం.

 

 సిహెచ్ శ్రీనివాస్., టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు 

నమస్తే భారత్ :-మహబూబాబాద్ 

మనం ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోకుండా. మనం పుట్టిన ఊరుకు ఉపకారం చేయాలనే ఆలోచన కలిగి ఉండడం అభినందనీయమని టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. 
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సూదనపల్లి గ్రామానికి చెందిన అనేకమంది జీవనోపాధి కోసం హైదరాబాద్ వెల్లి రకరకాల వృత్తులలో స్థిరపడ్డారు. కష్టపడి వారు ఎంచుకున్న రంగంలో ఎదిగారు. తమ కుటుంబంతోపాటు మరికొందరికి సహాయం చేయగలిగిన స్థాయికి చేరుకున్నారు.వారిలో కొందరికి ఓ.ఆలోచన వచ్చింది. తమను దీవించి పంపిన తమ జన్మభూమి సూదనపల్లి ఊరి బాగుకోసం ఏదైన తమ శక్తిమేరకు చేస్తే బాగుంటుందనేఆ.ఆలోచన అనేకమందిని ఐక్యం చేసింది.సూదనపల్లి ఐక్యతే శక్తి.ఆవిర్భావం
మంచి ఆలోచన కార్యరూపం దాల్చింది. ఒక్కక్కరిగా ఉంటే చేసే సహాయం శక్తి కి మించిన భారం అవుతుంది.ఐక్యంగా కలిసి అడుగుముందుకు వేస్తే ఖచ్చితంగా విజయం మనదవుతుంది అనే ఆలోచనతో సూదనపల్లి ఐక్యతే శక్తి అనే పేరుతో ఓ..సమూహం ఏర్పడింది.  గ్రామానికి సేవచేయడం అనే ఆలోచనను తమకు బతుకుపాటాలు నేర్పిన సూదనపల్లి బడి నుండి ప్రారంబించారు‌‌.ప్రముఖ టివి సీరియల్ ల దర్శకుడు, ఇదే గ్రామానికి చెందిన నీలం రాజు ఆద్వర్యంలో సభ్యులంతా హైదరాబాద్ నుంచి తమ గ్రామానికి వచ్చి సూదనపల్లి ఎంపీ, యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 100మంది విద్యార్థులకు టై, బెల్ట్, బూట్లను బుధవారం పంపిణీ చేసారు..పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధరావత్ వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ..ఆదర్శనీయమైన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ. సూదనపల్లి ఐక్యతే శక్తి సభ్యులను, వారి గొప్ప ఆలోచనను, ఆచరణలో చూపిన తీరును అభినందించారు‌.  ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న  పేద పిల్లలకు  బూట్లు, ,టై, బెల్ట్ లు పంపిణీ చేసి చదువులోనే  విజయం ఉందని, చక్కగా చదువుకోండని ప్రోత్సహించారన్నారు. భవిష్యత్ లోనూ బడి ని బాగు చేసే కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఎక్కడెక్కడో స్థిరపడిన యువత తమ గ్రామాలలోనూ  ఇదే స్పూర్తితో తమ.తమ గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.సూదనపల్లి ఐక్యతే శక్తి అద్యక్షులు, ప్రముఖ దర్శకుడు నీలం రాజు మాట్లాడుతూ. గ్రామస్తులు అందరూ సహకరిస్తే ఊరి బాగు కోసం మరిన్ని కార్యక్రమాలను చేపడతామని ప్రకటించారు. ఈ. కార్యక్రమంలో *సూధనపల్లి ఐక్యతే శక్తి బాద్యులు నీలం రాజు, చిన్నబోయిన లక్ష్మణ్, నీలం ఉపేందర్, అక్కినపల్లి మధుసూదన్, మద్దెల రాంప్రసాద్, అక్కినపల్లి మహేష్, ఆవుల వెంకన్న, దిడ్డి లక్ష్మణ్, కుర్ర వీరన్న, బొడ్డు అశోక్, మలిశెట్టి వేణు, పాఠశాల ఉపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్, ఎండి అంజాద్ పాషా, జి బాలరాజు, బి సరోజ, వి శుభ, కే సారంగం, ప్రగతి, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం పాలిటెక్నిక్ ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో...
ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ లేఖ..
రోడ్డు ఎత్తు పెంచడంతో వర్షం నీరు ఇండ్లలోకి వస్తుందని గ్రామస్థుల ధర్నా
మండలంలో.. మట్టి దొంగలు.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
పహల్గాం ప్రస్తావన లేకుండానే ఎస్సీవో పత్రం.. సంతకం చేయని రాజ్‌నాథ్‌ సింగ్‌
ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, రామ్ చ‌ర‌ణ్
ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్