మహిళలకు ఏ రకమైన ఇబ్బందులు జరిగిన మహిళలు మౌనం వీడి పోలీసులకు తెలియపరచాలి

మహిళలకు ఏ రకమైన ఇబ్బందులు జరిగిన మహిళలు మౌనం వీడి పోలీసులకు తెలియపరచాలి

 

 నమస్తే భారత్ సిద్దిపేట : సిద్దిపేట పట్టణం గాంధీ చౌక్  లేబర్ అడ్డ వద్ద కార్మికులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సామాజిక రుగ్మతల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట షీటీమ్ బృందం ఏఎస్ఐ కిషన్, మహిళా కానిస్టేబుళ్లు  రజని, మమత  కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణ, ప్రవీణ్* 

*ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి అడ్డ దగ్గరికి వచ్చి  పని ఉందని చెప్పి మోటార్ సైకిల్ పై లేదా కారులో ఎక్కించుకొని  పోతానంటే నమ్మవద్దు అతని వెంబడి వెళ్లి మోసపోవద్దని కొంత దూరం తీసుకుని వెళ్లి  మీ పైన ఉన్న నగలు దోచుకొని మిమ్మల్ని  ఎక్కడో వదిలిపెట్టి వెళ్తారు జాగ్రత్తగా ఉండాలి.

మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుంది 

*సైబర్ నేరాల  పట్ల అప్రమత్తంగా ఉండాలి

అపరిచితుల వ్యక్తుల మాటలు నమ్మవద్దు

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అమాయక ప్రజలను చూసి ఇది ఇస్తాము అది ఇస్తాము  కొన్ని డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి అని మోసం చేసేవారు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి

ప్రజలకు మహిళలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, షీటీమ్ ద్వారా ఎలా రక్షణ పొందొచ్చు అనే అంశాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు,నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై  అప్రమత్తంగా ఉండాలన్నారు. స్కూల్ వెళ్లే పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండాలని సూచించారు,
సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది  సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు సూచించారు.
పిల్లలను వేసవికాలం అయినందున ఎటుపడితే అటు మరియు ఈతకు పంపవద్దని సూచించారు. రాత్రి సమయాలలో ఇంటికి తాళం వేసి ఇంటి ముందర లేదా డాబాపై  పడుకునే అలవాటు ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలు వ్యవసాయ పనులపై ఒంటరిగా వెళ్లేటప్పుడు వంటిపై బంగారం ఉంటే దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడాలి మహిళలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మరియు అవహేళనగా మాట్లాడిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ షీటీమ్ నెంబర్ 8712667434 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని  సమాచార అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు...
ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ టీజ‌ర్ టైం ఫిక్స్.. ప్రీ టీజ‌ర్ చూశారా.!
మోదీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి.. అమిత్‌షాను ప్రధానిని చేయాలి.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు
వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌.. నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి
పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి
రైతు భరోసా కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి
రంగారెడ్డి జిల్లాలో మండల వారీగా కేటీఆర్ సేన కమిటీలు.. ప్రారంభం