పోలీసు కలర్ బృందంచే ప్రజలకు అవగాహన సదస్సు 

పోలీసు కలర్ బృందంచే ప్రజలకు అవగాహన సదస్సు 

 

నమస్తే భారత్ సిద్దిపేట : 

పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 13-06-2025 రోజు రాత్రి  " రాజగోపాలపేట    పోలీస్ స్టేషన్ పరిధిలో  "ముండ్రాయి"  గ్రామంలో నిర్వహించడం జరిగింది

రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ

ఆశ, భయము, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి, బ్యాంకు అధికారులు అని ఫోన్ చేస్తే నమ్మవద్దు, మీ ఫోన్ లకు వచ్చే మెసేజ్లు మరియు మీ వాట్సాప్ లో వచ్చే లింకులను ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు గుర్తుతెలియని ఏ మెసేజ్ వచ్చినా వెంటనే డిలీట్ చేయాలని సూచించారు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరం జరిగే అవకాశం ఉండదన్నారు. ఎవరు కూడా డబ్బులు ఊరికనే ఇవ్వరు ఇది బాగా ఆలోచించుకోవాలన్నారు. తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మిస్తే ఇది మోసం జరుగుతుందని ప్రతి ఒక్కరూ గమనించాలి   మరియు అకౌంట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దు, ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు
గ్రామంలో మరియు మండల కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే ప్రజలకు మరింత భద్రత ఉంటుందని తెలిపారు గ్రామంలోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా  లేదా గ్రామంలో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే  ఎవరు తప్పు చేశారు ఏం జరిగింది  తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న గ్రామాలలో దొంగలు దొంగతనం చేయడానికి భయపడతారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు సహకరించాలని సూచించారు.*

👉రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని తెలిపారు. మోటార్ సైకిల్ వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా ధరించాలన్నారు.

యుక్త వయసులో ఉన్న యువతి యువకులపై  తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని సూచించారు  స్కూలుకు వెళుతున్నారా కాలేజీకి వెళుతున్నారా  ఇంకెక్కడైనా తిరుగుతున్నారా  నిఘా ఉంచడం చాలా ముఖ్యమన్నారు

మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలు, సామాజిక రుక్మతల గురించి  సిద్దిపేట పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు రాజేష్, భాస్కర్, యాదగిరి, నర్సింలు, బాబు, మంజుల, రాజమణి, వెంకటేష్ నాటకం పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు  ప్రజాప్రతినిధులు, యువతి యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు...
ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ టీజ‌ర్ టైం ఫిక్స్.. ప్రీ టీజ‌ర్ చూశారా.!
మోదీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి.. అమిత్‌షాను ప్రధానిని చేయాలి.. కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు
వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌.. నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ : మంత్రి పొంగులేటి
పెన్షనర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి
రైతు భరోసా కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇవ్వాలి
రంగారెడ్డి జిల్లాలో మండల వారీగా కేటీఆర్ సేన కమిటీలు.. ప్రారంభం