పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కట్టేది ఎప్పుడు పాలమాకుల జంగయ్య
నమస్తే భారత్ షాద్ నగర్ జులై15:పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారు సమాధానం చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లేడు చౌదరిగుడా మండల మహాసభ లాల్పహాడ్ సలీం ఫంక్షన్ హాల్ లో కామ్రేడ్ బంగారు చంద్రయ్య ప్రాంగణంలో పిట్టే మాణిక్యరావు ఎం అనిత అధ్యక్షతన జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల బ్యాక్ వాటర్ తీసుకొని 73 కిలోమీటర్లు 9వేల కోట్లతో నిర్మిస్తే 12 మండలాలు సాగుబాటుఐతాయి అని రిటైర్ ఇంజనీరింగ్ పోరం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నివేదిక నిచ్చింది కానీ దానికి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోయింది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 కోట్ల రూపాయలను సర్వే పనుల నిమిత్తం కేటాయింపు జరిగింది అయినా సర్వే పనులు చేయించలేక ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక పోయింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమని ఆయన విమర్శించారు తెలంగాణ వచ్చినంక నేను నిర్మిస్తానని ఉమ్మడి కొందుర్గు మండల కేంద్రంలో హామీ ఇచ్చిన కెసిఆర్ తెలంగాణ వచ్చి పది సంవత్సరాల కాలంలో దాని డిజైన్ మార్చి శ్రీశైలం బ్యాక్ వాటర్ తోని పాలమూరు రంగారెడ్డి
ఎత్తిపోతల పథకాని నిర్మిస్తా
అని ప్రగాలు పలికి కరివేనా ఉదండాపూర్ లోకిరేవు చిన్న చిన్న ప్రాజెక్టులు అంతంత మాత్రంగానిర్మిస్తూ తీర లక్ష్మీదేవి ప్రాజెక్టుకు కనీసం పునాది రాయకుండా వేలేకపోయినరని ఇది గత ప్రభుత్వ దౌర్భాగ్య పరిస్థితి అని ఆయన మండిపడ్డారు కెసిఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పలుమార్లు లక్ష్మీదేవి పల్లి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథక స్థల పరిశీలన లాంటివి అనేకం చేశాయి కేసీఆర్ ప్రభుత్వం మీద చవాకులు ఆవాలు పేలి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఆ పథకం ఊసే లేదని ఇదెక్కడి అన్యాయం అని ఆయన విమర్శించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టకపోతే సిపిఐ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలకు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు పోరాటాలకుసిద్ధం కావాలని దానికి జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ నుంచి తగు సహకారం అందిస్తామని పాలమాకుల జంగయ్య మండల పార్టీకి తెలిపారు ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా నామవాత్రంగా ఉన్నాయని పథకాల అమలు కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని పథకాలన్నీ కూడా సక్రమంగా అమలయేటట్టు లబ్ధిదారులను కూడగట్టి పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరు నరసింహారెడ్డి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లేడు చౌదరిగుడా మండల నిర్మాణ బాధ్యులు బుద్ధుల జంగయ్యలు మాట్లాడారు ఈ మహాసభలో 21 మంది నూతన కౌన్సిల్ 9 కార్యవర్గం మండల కార్యదర్శిగా జిల్లెల్ల వెంకటేష్ మండల సహాయ కార్యదర్శిలుగా కాలపురం బాలరాజ్ ఎండి షబ్బీర్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి యాదయ్య వి భీమయ్య పి పద్మ లక్ష్మి వి రాములు కే లింగమయ్య రామకృష్ణ గోపాల్ వీరేశం యస్ మల్లయ్య తదితరులు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

