హలో దివ్యంగు... చలో సిద్ధిపేట్
దివ్యాంగుల జిల్లా మహాసభను విజయవంతం చేయాలి
- సిద్దిపేట ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు
- ముక్కపల్లి రాజు మాదిగ
నమస్తే భారత్, దుబ్బాక..
వి హెచ్ పి ఎస్, టిజిడిజేఏసీ వివిధ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం సమావేశం జరిగింది ఈనెల 16 న హలో దివ్యాంగు.. చలో సిద్ధిపేట్ దివ్యాంగుల జిల్లా మహాసభ కు ముఖ్యఅతిథిగా దివ్యాంగుల ఆత్మబంధువుడు విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రావడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా గాని దివ్యాంగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం 4016 పెన్షన్ ను 6016 వరకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు 2016 నుండి 4016 వరకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచకపోవడం చాలా బాధాకరం అని తెలిపారు. ఎన్నో దివ్యాంగుల కుటుంబాలు ఆసరా పెన్షన్ పైన బతుకుతున్నారని తెలిపారు. నేడు సకాలంలో పెన్షన్ పడక ఎంతో ఇబ్బంది పడుతూ వచ్చిన పెన్షన్ కూడా వారి హాస్పిటల్ ఖర్చులకు కూడా సరిపోవటం లేదని చెప్పారు. కొంతమంది దివ్యాంగులు ఒక పూట తింటూ మరో పూట పస్తులు ఉంటూ కాలం గడుపుతున్నారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల బాధలు కనిపించడం లేదా ? దివ్యాంగులు అంటే ఇంత చిన్న చూపా ? దివ్యాంగులు అంటే వివక్షత ఎందుకో తెలియడం లేదని అన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. దివ్యాంగులు మహిళల కంటే అద్మానమా లేక దివ్యాంగుల్లాగా కనపడడం లేదా అని మండిపడ్డారు. దివ్యాంగులకు అంత్యోదయ కార్డ్స్ మంజూరు చేయడం లేదు. దివ్యాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి బాధలు ఎన్నో ఉన్నాయి. సభ స్థలం కాబట్టి ఈనెల 16న సిద్దిపేట పట్టణ కేంద్రం మెట్రో గార్డెన్ లో చేపట్టబోయే దివ్యాంగుల జిల్లా మహాసభ కు దుబ్బాక నియోజకవర్గం నుండి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దొమ్మట జోగయ్య, చెక్కపల్లి మహేష్ మాదిగ , మండల MSP ఉపాధ్యక్షులు వజపల్లి రాజేశ్వరరావు, ముక్క పల్లి కనకరాజు, ఎండి చాందుమియా, శ్రీ గద రవి, గడ్డమీది లక్ష్మీ నరసయ్య, లింగన్నపేట నరసయ్య, దాకలి రవి, ఊటకారి నర్సింహులు మండల ప్రశాంత్ , జీడి కిరణ్ కుమార్, కళ్ళకు దేవలక్ష్మి, బొందు శ్రీహరి, ధర్మాజీపేట రాజయ్య ,తదితరులు పాల్గొన్నారు .
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

