గణపతి దేవాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన: రాజ్ కుమార్ రెడ్డి

గణపతి దేవాలయ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన: రాజ్ కుమార్ రెడ్డి

 

---గురుస్వాములతో కలిసి దేవాలయ నిర్మాణ కొలతల పరిశీలన

నారాయణపేట జిల్లా / నమస్తే భారత్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని వల్లంపల్లి రోడ్డులో ఉన్న శబరి పీఠం దేవాలయ ఆవరణలో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న శ్రీ గణపతి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన కొలతలను ఆదివారం దేవాలయ నిర్వాహకులు, గురుస్వాములతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే శ్రీ గణపతి దేవాలయ నిర్మాణానికి గురుస్వాములు, భక్తులతో కలిసి శంకుస్థాపన చేస్తామని రాజ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. శబరి పీఠం ప్రాంగణంలో గణపతి ఆలయాన్ని నిర్మించాలని జనవరి మాసంలో రాజ్ కుమార్ రెడ్డిని కలిసి విన్నవించడం జరిగిందని, కోరిన వెంటనే గణపతి దేవాలయ నిర్మాణానికి సహకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు కాకర్ల భీమయ్య, అప్పి, జంగిటి వెంకటేష్, బాబు, తిప్పన్న, కృష్ణ, బాలు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ సమస్యలు పరిష్కరించాలలి. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ సమస్యలు పరిష్కరించాలలి.
    -- ప్రజా సమస్యలు ఇంకా శాశ్వతంగా పరిష్కారం కాలేదు   -- పినపాక మండలంలో పలు గ్రామాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న బత్తుల  -- సంక్షేమ
మాస్ లైన్ కేంద్ర నాయకులు చంద్రశేఖర్  వర్థంతి సభను జయప్రదం చేయండి
సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తున్నాం : మంత్రి నిమ్మల 
ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపట్టండి.
జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలకేంద్రంలో మహబూబ్నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన 
నీటి  బోరు ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాజ్ కుమార్ రెడ్డి
ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: డీఎస్పి