ప్రమాద బీమా పథకం అమలులో దేశానికే ఆదర్శం సింగరేణి
* సింగరేణి బాటలో పలు రాష్ట్రాల్లో ప్రమాద బీమా పథకం అమలు
* కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కు పంపిణీ కార్యక్రమంలో సీఎండీ ఎన్.బలరామ్
నమస్తే భారత్/భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు సింగరేణి సంస్థ ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా అమలు జరుపుతున్న కోటి రూపాయల ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శప్రాయం అయిందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన మణుగూరుకు చెందిన ఈపీ ఆపరేటర్ మూల్ చంద్ విశ్వకర్మ సతీమణి హరిదేవి విశ్వకర్మకి శుక్రవారం కొత్తగూడెం హెడ్డాఫీసులో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎండీ తన సందేశం ఇచ్చారు.
మణుగూరులో ప్రమాదంలో మృతి చెందిన మూల్ చంద్ విశ్వకర్మకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పోరేట్ శాలరీ అకౌంట్ ఉందని ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి కోటి రూపాయల బీమా వర్తించిందన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు ప్రభుత్వ సంస్థల్లో లేని విధంగా సింగరేణి సంస్థ తొలిసారిగా బ్యాంకుల వారితో మాట్లాడి గరిష్టంగా కోటి 25 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు జరపడం జరిగిందని దీనివల్ల ప్రమాద బాధిత మృతుల కుటుంబీకులకు ఆర్థికంగా గట్టి భరోసా లభిస్తోందన్నారు. సింగరేణిలో అమలు జరుగుతున్న ఈ ప్రమాద బీమా పథకాన్ని అసోం ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు కోల్ ఇండియాలో కూడా అమలులోకి తీసుకువచ్చారన్నారు. బీమా రంగంలో విప్లవాత్మక పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వ చొరవ సింగరేణి ముందడుగే కారణమన్నారు.
ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండాలని సంస్థ ఎప్పుడూ ఆశిస్తుందని అయితే అనుకోని ప్రమాదాల వల్ల ఉద్యోగి మృతి చెందితే ఒక్కసారిగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో బ్యాంకు వారితో మాట్లాడి శాలరీ అకౌంటు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరపడం జరిగిందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా 40 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నామన్నారు. కొత్తగూడెంలో మృతుడి కుటుంబీకులకు డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్ వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ పర్సనల్
కే.వెంకటేశ్వర్లు, ఎస్.బి.ఐ. డీజీఎం సత్యనారాయణ కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును హరిదేవి విశ్వకర్మకు అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్.డి.ఎం.సుభానీ, జీఎం(ఐఆర్ పీఎం) కవితా నాయుడు, జీఎం(ఆర్సీ) కుమారి నికోలస్, జీఎం(వెల్ఫేర్) జి.వి.కిరణ్ కుమార్, హెచ్ వో డీ(ఈఈ సెల్) ఎ.జె.ఎం.మురళీధర్, గుర్తింపు ప్రాతినిథ్య అధికారుల సంఘం నాయకులు ఎస్వీ రమణ మూర్తి, ఎస్.పీతాంబరరావు, సునీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Related Posts
