ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన. స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్

 

నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్

--- పేట జిల్లాలో ప్రారంభమైన బడి బాట కార్యక్రమం.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు చక్కటి వసతి సౌకర్యాలు ఉన్నాయని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యాంగ్వర్ తెలిపారు. శుక్రవారం నారాయణపేట జిల్లాలోని కోస్గి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన  బడిబాట గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య చక్కటి వసతులు  అల్పాహారం పోషకాహారం అందించడమే కాకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇస్తారన్నారు. పదవ తరగతిలో వెనకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి మెరుగైన ఉత్తీర్ణత కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే  ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం అన్ని పాఠశాలల్లో  సుశిక్షితులైన ఉపాధ్యాయులు, తరగతి గదుల్లో అత్యాధునికమైన డిజిటల్ బోర్డుల ద్వారా బోధించడం జరుగుతుందని,  ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ద్వారా వెనకబడ్డ విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, ఎక్సెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో డిజిటల్ బోధన తదితర అధునాతన బోధనా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.  జిల్లాలోని లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, మహిళా సంఘాలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, యువజన సంఘాలు, ప్రత్యేక కార్యాచరణ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో  పిల్లలను చేర్పించుటకు ఎన్ రోల్ మెంట్  డ్రైవ్ ప్రారంభించినట్టు అదనపు  కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం  
 కోస్గి బహర్ పేట్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులక్ లాంచనంగా ప్రవేశాలు నమోదు చేశారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ లు అందజేశారు.కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 470 పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ప్రారంభమైనట్లు జిల్లా విద్యా శాఖ కార్యాలయ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు, ఎంఈఓ శంకర్ నాయక్, తహసిల్దార్ బక్క శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్, సీఎంఓ రాజేంద్రకుమార్, మధ్యాహ్న భోజన జిల్లా సమన్వయకర్త యాదయ్య శెట్టి, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డిపిఎం సదానందం, మున్సిపల్ కమిషనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News