సాండ్ బజార్ ఏర్పాటు చేయండి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నమస్తే భరత్ షాద్ నగర్ జూన్03:షాద్ నగర్ నియోజకవర్గంలో భవన నిర్మాణాలకు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాండ్ బజార్ ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర మైన్స్ మరియు జియోలాజి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్,తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భవేష్కుమార్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. షాద్ నగర్ నియోజక వర్గంలో లో ఇండ్ల నిర్మాణాలకు దూర ప్రాంతాల నుంచి ఇసుక కొనుగోలు వలన వ్యయం పెరగడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇసుక అందుబాటులో ఉండటం లేనందున సాండ్ బజార్ ను ఏర్పాటు చేయాలని కోరారు.ఇటీవల సాండ్ బజార్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ,ఇతర వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో షాద్ నగర్ లో కూడా సాండ్ బజార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

