సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చెయ్యండి
కుత్బుల్లాపూరులో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ కమిటీ ఏర్పాటు
ఇంటింటికీ సీపీఐ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిశ్చయించిన
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే, కూనంనేని సాంబశివరావు,
నమస్తే భారత్, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని మహారాజ గార్డెన్ లో 2025, ఆగస్టు 19-22 వరకు జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘ సమావేశానికి సాంబశివరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్. బోస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల నిర్వహణకు ఆతిధ్యం ఇచ్చిన సీపీఐ మేడ్చల్ జిల్లా సమితికి వారు అభినందనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో జరగనున్న రాష్ట్ర మహాసభలకు జాతీయ నేతలు, అన్ని జిల్లాల నుండి దాదాపు 1000 మంది పార్టీ ప్రతినిధులు హాజరై, ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులపై, చర్చలు జరిపి తీర్మానాల రూపంలో భవిష్యత్ పోరాటాలకు మహాసభ వేదిక కానుందన్నారు. అందుకే రాష్ట్ర మహాసభల విజయవంతానికి ప్రతి కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రజల వద్దకు కరపత్రాలను పంచి, మహాసభల విజయవంతానికి హార్ధిక, ఆర్ధిక సహాయ సహకారాలు తీసుకొని, ప్రజలను భాగస్వామ్యం చేయాలని వారు పిలుపునిచ్చారు.
అదే విధంగా మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, అమాయక గిరిజనులను హతమారుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తక్షణమే నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, సీజ్ ఫైర్ ను ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేస్తోందన్నారు.కాశ్మీర్ పహల్గాం లో దేశ పౌరులపై నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల ఘటనలో 27మందికి పైగా మరణించారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోకుండా చేతకాకుండా ఉన్నారని, కానీ దేశంలోని పౌరులు అమాయక ఆధీవాసీలను హహనం చేయడం అప్ప్రజాస్వామికమన్నారు. యుద్ధాన్ని అపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెబుతున్న మాటలు వింటే , మన దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్ కు దేశాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిన మోదీకి దేశ ప్రధానిగా కొనసాగే నైతికత లేదని వారు విమర్శించారు.
మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ సీనియర్ నేత పీజే. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల నిర్వహణ అంటే పార్టీ నూతనోత్సాహంకు, పార్టీ ఎదుగుదలకు తార్కాణం అని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు ఎండీ. యూసుఫ్, సీపీఐ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత పీజే. చంద్రశేఖర్, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం. నర్సింహా, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ. సాయిలు గౌడ్,సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఈ. ఉమామహేష్, సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు యేసు రత్నం, జీ. దామోదర్ రెడ్డి, జే. లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి. లక్ష్మణ్, సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. స్వామి, హరినాధ్ రావు, ఎస్. శంకర్ రావు, శంకర్, టి. సత్య ప్రసాద్, కృష్ణ, లతో పాటు సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి సభ్యులు దశరథ్, సహదేవ్, శశిదర్ రెడ్డి, సల్మాన్ బేగ్, యాదయ్య, మాధవి, శ్రీనివాస్, లొట్టి ఈశ్వర్, వెంకట్ రెడ్డి, పరమేశ్వర, నాగరాజు, రవి చంద్ర, ప్రమీల, డీజీ. నరేంద్ర ప్రసాద్, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

